ఏపీ నూతన సీఎస్గా నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ
ఏపీ నూతన సీఎస్గా నీలం సాహ్నీని నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1984 బ్యాచ్కు చెందిన సాహ్నీని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఝప్తి మేరకు కేంద్ర సర్వీసుల్లో విధుల నుండి రీలీవ్ చేశారు. దీంతో ప్రభుత్వ రాజకీయ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదీలీ తర్వాత సీసీఎల్ఏ ముఖ్యకార్యదర్శి నీరబ్ కుమార్కు సీఎస్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆమె భాద్యతలు చేపట్టడడంతో ఆయన రిలీవ్ అయ్యారు. గురువారం ఆమె 11 గంటలకు పదవీ భాద్యతలు చేపట్టనున్నారు.
ఏపీకి నూతన సీఎస్ గా ఎల్వీ సుబ్రమణ్యం బదిలీకి ముందే ఖారారైంది. పలు రాజకీయ కారణాలతో సభ్రమణ్యంను బదీలీ చేయడంతో ఆయన సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే.. ఇక నూతన సీఎఎస్ గా నియమింపబడ్డ నీలం సాహ్ని ఉమ్మడి ఏపీలో పలు కీలక పోస్టులు నిర్వహించారు. నల్లగొండ కలెక్టర్గా పనిచేశారు. గత కొంతకాలంగా కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్పై ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయ విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్న నీలం సాహ్నికి వచ్చే ఏడాది జూన్ వరకు సర్వీసు ఉంది. ఆమెను తిరిగి రాష్ట్ర సర్వీసులోకి పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలోనే రాష్ట్రానికి రిలీవ్ చేశారు. కేంద్రం అనుమతించిన వెంటనే ఆమెను సీఎ్సగా నియమించారు.