వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యావసరాల కోసం పట్టణవాసుల నరకం ... ఏపీ ప్రభుత్వ కఠిన నిబంధనలే కారణం

|
Google Oneindia TeluguNews

ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు సామాన్యులకు తిప్పలు తెచ్చి పెడుతుంది. నిత్యావసరాల కోసం వెళ్ళినా సామాజిక దూరం పాటించాల్సిన పరిస్థితి . మాల్స్ కి వెళ్ళినా మినిమం రెండు మూడు గంటలు ఈజీగా పడుతున్న పరిస్థితిలో ఏపీలో కర్ఫ్యూ సడలింపు కుదింపు సామాన్యులను చాలా ఇబ్బంది పెడుతుంది.

లాక్ డౌన్ ఎఫెక్ట్ ... పెన్షన్ లతో పాటు ఆర్ధిక సాయం ఇచ్చేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయంలాక్ డౌన్ ఎఫెక్ట్ ... పెన్షన్ లతో పాటు ఆర్ధిక సాయం ఇచ్చేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం

 ఏపీ ప్రభుత్వ కఠిన నిర్ణయాలతో ప్రజల తిప్పలు

ఏపీ ప్రభుత్వ కఠిన నిర్ణయాలతో ప్రజల తిప్పలు

కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా మారుతున్న నేపధ్యంలో ఏపీ షట్ డౌన్ చేశారు .లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కూడా ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. ఇక ఈ నేపధ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటించటం లేదని భావించిన ఏపీ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకుంది . ఇప్పటికే ఏపీలో లాక్ డౌన్ సందర్భంగా కర్ఫ్యూ అమలవుతుంది. ఇక ఆ కర్ఫ్యూలో ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిత్యావసరాల కొనుగోలు కోసం ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. కానీ ప్రజలు సామాజిక దూరం పాటించకపోవటంతో కర్ఫ్యూ సడలింపు కుదించారు . కేవలం 11 గంటల వరకే పట్టణాల్లో పరిమితం చెయ్యటం ప్రజలకు ఇబ్బందిగా మారింది .

 షాపింగ్ మాల్స్ వద్ద క్యూ లైన్ లు .. సామాజిక దూరంతో షాపింగ్ ఆలస్యం

షాపింగ్ మాల్స్ వద్ద క్యూ లైన్ లు .. సామాజిక దూరంతో షాపింగ్ ఆలస్యం

ఇక ఇదే ఏపీ వాసులకు తిప్పలు తెచ్చి పెడుతుంది. నిత్యావసరాలను తెచ్చుకునేందుకు కూడా వీలు కాని పరిస్థితి తెచ్చి పెట్టింది . పట్టణాల్లో నిత్యావసరాల కోసం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకే కొనుగోలు చెయ్యాలని చెప్పటంతో ప్రజలు ఆ సమయంలో మార్కెట్ ల వద్దకు వెళ్ళటంతో రద్దీ నెలకొంది. ఇక ఇదే సమయంలో మార్కెట్ ల వద్ద , కిరాణా సామాను తెచ్చుకునేందుకు వెళ్ళిన షాపుల వద్ద సామాజిక దూరం పాటించాల్సి రావటం , కొంత మందినే లోనికి అనుమతించటం వంటి చర్యలతో ఒక గంటలో అయిపోవాల్సిన షాపింగ్ కాస్తా రెండు, మూడు గంటల పాటు పడుతుంది . దీంతో నరకం చూస్తున్నారు ప్రజలు . ఈ లైన్లలో నిలబడటం మా వల్ల కాదని గగ్గోలు పెడుతున్నారు.

 సరుకుల కోసం వచ్చినా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన

సరుకుల కోసం వచ్చినా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన

ఇక ఇదే సమయంలో రోడ్ల మీదకు వస్తే పోలీసుల ఇబ్బంది బాగా పెరిగిపోయిందని లబోదిబోమంటున్నారు. పనుల్లేక , పైసలు లేక , పస్తులు ఉండలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు ప్రభుత్వ కఠిన నిబంధనలతో మరింత ఇబ్బందికి గురవుతున్నారు. కేసులు పెరుగుతున్నాయని , ప్రజలు రోడ్ల మీదకు రాకుండా కంట్రోల్ చెయ్యటం కష్టంగా మారుతుందని భావిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సర్కార్ ఇంటింటికీ మొబైల్ సేవలు అందిస్తామని చెప్పినా అవి అన్ని చోట్ల అందుబాటులో లేవు.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
కుదించిన సమయంలో నిత్యావసరాల కొనుగోలు కష్టం అంటున్న ప్రజలు

కుదించిన సమయంలో నిత్యావసరాల కొనుగోలు కష్టం అంటున్న ప్రజలు

విపరీతంగా పెంచి అమ్ముతున్న ధరలతో బయట కొనుగోలు అంటే భయపడుతున్నారు. కొన్ని మార్ట్ లలో, మాల్స్ లలో మాత్రం కాస్త ధరలు అందుబాటులో ఉన్న నేపధ్యంలో అక్కడికి వెళ్ళటానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇక ప్రభుత్వం సమయం తక్కువ చేసి నిత్యావసరాలు కొనుగోలు చెయ్యమంటే షాపింగ్ మాల్స్ , మార్ట్ ల దగ్గర పరిస్థితి వేరేలా ఉంది . దీంతో ఇవెక్కడి తిప్పలురా బాబూ అంటూ తెగ బాధ పడుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి ఎప్పటికి వదులుతుందో అని తెగ ఫీల్ అవుతున్నారు.

English summary
The government's tough decisions in AP made it impossible to meet the necessities. It was crowded with people going to the markets at the time, saying they had to buy between 6am and 10am for emergencies. At the same time, shopping in a marketplace, grocery shopping,and a few people letting in, takes about two to three hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X