వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ప్రజలకు త్వరలో శుభవార్త, బాబుపై నమ్మకంతోనే: అమర్నాథరెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రజలు త్వరలోనే శుభవార్త వింటారని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. సచివాలయంలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ నూతన చాంబర్‌ను మంత్రి ప్రారంభించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలు త్వరలోనే శుభవార్త వింటారని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. సచివాలయంలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ నూతన చాంబర్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై నమ్మకంతోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి అమర్నాథ్ రెడ్డి చెప్పారు. అంతేగాక, ఏపీ.. పరిశ్రమలకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఏపీకి 950కి.మీల కోస్టల్ కారిడార్ ఉందని చెప్పారు.

AP people will hear good news in soon, says Amarnath Reddy

చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనందిస్తామని మంత్రి అమర్నాథ రెడ్డి తెలిపారు. 2014లో విద్యుత్ కోతలుండేవి, కానీ, ఇప్పుడు మిగులు విద్యుత్‌లో ఉన్నామని మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు.

రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గే అవకాశముందని తెలిపారు. మొత్తానికి చూస్తే ఏపీ ప్రజలు త్వరలోనే విద్యుత్ ఛార్జీల విషయంలో శుభవార్త వింటారని ఆయన తెలిపారు.

English summary
Andhra Pradesh minister Amarnath Reddy on Thursday said that people of state, will hear good news in soon on power charges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X