ఏపీలో మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు.. రిమాండ్ కు తరలింపు... కేసు ఏంటో తెలుసా .?
ఏపీలో టీడీపీ తాజా, మాజీ ఎమ్మెల్యేల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మరో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో అచ్చెన్నాయుడును ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు పంపారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇవాళ హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న అనంతపురం పోలీసులు మధ్యాహ్నం తర్వాత కోర్టులో హాజరు పర్చనున్నారు. ఇదే కోవలో మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను కూడా పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
Recommended Video
టీడీపీ హయాంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేని ప్రభాకర్ ను జిల్లా పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. కరోనా నిబంధనల ఉల్లంఘన పేరుతో నిన్ననే ఆయన్ను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు.... ఇవాళ అధికారికంగా అరెస్టు చేసి స్ధానిక కోర్టులో హాజరు పరిచారు. ఆయనపై కరోనా నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో సెక్షన్ 341, 353 కింద కేసులు నమోదు చేశారు. 8 మంది అనుచరులతో కలిపి ప్రభాకర్ ను జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా... రెండు వారాల రిమాండ్ విధించారు. దీంతో వీరిని ఏలూరులోని సబ్ జైలుకు తరలిస్తున్నారు.
అచ్చెన్న, జేసీ అరెస్టులకు సంబంధం ? జగన్ వ్యూహం అదేనా- నిజం చెప్పేసిన టీడీపీ ఎమ్మెల్సీ..