ఏపి డిజిపి కారులో తనిఖీలు : ఎందుకు చేసారు..ఏం తేల్చారు...!
Recommended Video
ఏపి ఎన్నికల వేళ ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా రాష్ట్ర డిజిపి ప్రయాణిస్తున్న కారులోనే పోలీసు సి బ్బంది తనిఖీలు చేసారు. కొద్ది రోజుల క్రితం ప్రతిపక్ష వైసిపి నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి స్వయంగా డిజి పి తన కారులో డబ్బులు తరలిస్తున్నారని ఫిర్యాదు చేసారు. అయితే, ఇందులో వాస్తవం ఎంత అనేది తేలలేదు. ఇక, ఇప్పుడు ఎన్నికల వేళ పోలీసు సిబ్బంది ఏకంగా డిజిపి కారునే తనిఖీ చేయటం హాట్ టాపిక్ గా మారింది..
డిజిపి కోరారా..సిబ్బందే చేసారా..
ఏపి డిజిపి కారును పోలీసు సిబ్బంది తనిఖీ చేసారనే వార్త పై రక రకాల వాదనలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్నికల వేళ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితులను పరిశీలించేందుకు డిజిపి ఠాకూర్ ప్రైవేటు వాహ నాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. డీజీపీ ఆర్.పి.ఠాకూర్ శృంగవరపుకోట మీదుగా అరకువైపు వాహనంలో వెళుతూ బొడ్డవర సమీపానికి చేరుకున్నారు. పోలీసు, అధికార బృందాలు వాహనాలను తనిఖీ చేస్తున్నాయి. యథావిధిగా తన వాహనాన్ని కూడా తనిఖీ చేయాలని డీజీపీ ఆదేశించటంతో తనిఖీ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారని స్థానిక అధికా రులు చెబుతున్నారు. అయితే, ప్రయివేటు వాహనంలో రావటంతో స్థానిక సిబ్బంది డిజిపి ని గుర్తించలేక సాధారణ క్రమంలో తనిఖీలు చేసారని మరో వాదన తెర మీదకు వచ్చింది.
ప్రతీ రోజు చేస్తే సంతోషిస్తా..
అయితే, ఈ తనిఖీల పై డిజిపి ఠాకూర్ పాజిటివ్ గా స్పందించారు. పోలీసు, రెవెన్యూ బృందాలు బాగా పనిచేస్తున్నా యని... విధి నిర్వహణలో భాగంగా నా వాహనాన్ని కూడా తనిఖీ చేసిన వారికి అభినందనలు తెలిపారు. ఆయా పోలీ సులకు రివార్డునివ్వాలని విజయనగరం ఎస్పీని ఆదేశించారు. తన వాహనాన్ని ప్రతి రోజూ ఇలా తనిఖీ చేస్తే ఇంకా సంతోషిస్తానని డీజీపీ పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి రాజీ వద్దని, అందరి వాహనాలను ఒకేలా చూసి తనీ ఖీలు చేయాలని సూచించారు. సిఐ..ఎస్సై స్థాయి అధికారులు ఏకంగా డిజిపి కారు లో తనిఖీలు చేయటం..అందునా డిజిపి కారులో ఉన్న సమయంలో ఈ తనిఖీలు చేయటం అనేది సాధారణ విషయం కాదని పోలీసు అధికారులు చెబు తున్నారు. డిజిపి ఈ విషయాన్ని సానుకూలంగా తీసుకోవటంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
డిజిపి పైనా వైసిపి ఫిర్యాదు..
ఎన్నికల వేళ..వైసిపి నేరుగా పోలీసు అధికారులనే లక్ష్యంగా చేసుకుంటోంది. కొద్ది రోజులుగా కేంద్ర ఎన్నికల సంఘా న్ని కలసి ఏపి డిజిపి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని..ఆయన్న ఎన్నికల విధుల నుండి తప్పించాల ని కోరింది. ఆ తరువాత వైసిపి ఎంపి విజయ సాయి రెడ్డి సీఈసి ని కలిసి డిజిపి కారులో ప్రకాశం జిల్లాకు పెద్ద మొత్తం లో నగదు తరలించాలరని ఫిర్యాదు చేసారు. వైసిపి ఫిర్యాదు మేరకే ఇప్పటికే ఏపి ఇంటలిజెన్స్ డిజి వెంకటేశ్వర రావు ను ఎన్నికల సంఘం విధుల నుండి తప్పించింది. ఇక, ఇప్పుడు పోలింగ్ దగ్గర పడే కొద్దీ ఎన్నికల సంఘం ఏపి పోలీసుల విషయంలో ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారింది. ఇదే సమయంలో ఏపి పోలీ సులు స్వయంగా డిజిపి కారులోనే తనిఖీలు చేయటం ద్వారా తాము నిష్పక్షపాతంగా పని చేస్తున్నామనే సంకేతాలు ఇవ్వగలిగారు.