ఏపీ పాలీసెట్ ఫలితాలు విడుదల: ముగ్గురికీ మొదటి ర్యాంక్
విశాఖపట్నం: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్-2018 పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విశాఖపట్నంలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు.
ఏప్రిల్ 12న పాలీసెట్ నిర్వహించగా.. ఫలితాలను రికార్డు సమయంలో విడుదల చేసినట్లు మంత్రి గంటా తెలిపారు. ఈ పరీక్షను 1,29,412 మంది విద్యార్థులు రాయగా.. 80.19 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు.
కాగా, ఈ పరీక్షల్లో ముగ్గురికి కూడా మొదటి ర్యాంకు కావడం గమనార్హం. చిట్నీడి గీతా సౌజన్య(తూర్పుగోదావరి), కంకటాల శ్రీహర్ష(తూర్పుగోదావరి), ( పిల్లి శ్రీకర్ బాబు(పశ్చిమగోదావరి)లు మొదటి ర్యాంక్ సాధించారు.
కేశారపు
సూర్య
వెంకట్(తూర్పుగోదావరి)-నాలుగో
ర్యాంక్,
పాకా
అఖిల్
చంద్(పశ్చిమగోదావరి)-ఐదో
ర్యాంక్,
ఆకుల
హేమంత్(
పశ్చిమగోదావరి)-ఐదో
ర్యాంక్,
మట్టా
వేద
సంహిత్(పశ్చిమగోదావరి)-ఐదో
ర్యాంక్,
కాగడాల
రాజా(
శ్రీకాకుళం
జిల్లా)-ఎనిమిదో
ర్యాంక్,
ఉట్ల
సాయి
సుస్మితశ్రీ(తూర్పుగోదావరి)-ఎనిమిదో
ర్యాంక్,
చిలుకూరి
విష్ణు
తేజారెడ్డి(పశ్చిమగోదావరి)-ఎనిమిదో
ర్యాంక్
సాధించారు.