వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ పాలీసెట్ ఫలితాలు విడుదల: ముగ్గురికీ మొదటి ర్యాంక్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్‌-2018 పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విశాఖపట్నంలోని వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు.

ఏప్రిల్‌ 12న పాలీసెట్‌ నిర్వహించగా.. ఫలితాలను రికార్డు సమయంలో విడుదల చేసినట్లు మంత్రి గంటా తెలిపారు. ఈ పరీక్షను 1,29,412 మంది విద్యార్థులు రాయగా.. 80.19 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు.

AP Polycet Results released

కాగా, ఈ పరీక్షల్లో ముగ్గురికి కూడా మొదటి ర్యాంకు కావడం గమనార్హం. చిట్‌నీడి గీతా సౌజన్య(తూర్పుగోదావరి), కంకటాల శ్రీహర్ష(తూర్పుగోదావరి), ( పిల్లి శ్రీకర్‌ బాబు(పశ్చిమగోదావరి)లు మొదటి ర్యాంక్ సాధించారు.

కేశారపు సూర్య వెంకట్‌(తూర్పుగోదావరి)-నాలుగో ర్యాంక్, పాకా అఖిల్‌ చంద్‌(పశ్చిమగోదావరి)-ఐదో ర్యాంక్‌, ఆకుల హేమంత్‌( పశ్చిమగోదావరి)-ఐదో ర్యాంక్‌,
మట్టా వేద సంహిత్‌(పశ్చిమగోదావరి)-ఐదో ర్యాంక్‌, కాగడాల రాజా( శ్రీకాకుళం జిల్లా)-ఎనిమిదో ర్యాంక్‌, ఉట్ల సాయి సుస్మితశ్రీ(తూర్పుగోదావరి)-ఎనిమిదో ర్యాంక్‌, చిలుకూరి విష్ణు తేజారెడ్డి(పశ్చిమగోదావరి)-ఎనిమిదో ర్యాంక్‌ సాధించారు.

English summary
The Andhra Pradesh Board of Technical Education and Training has released the results for Polytechnic Common Entrance Test on a third party website: www.manabadi.co.in and government website polycetap.nic.in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X