అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేషన్ వాహనాలపై వెనక్కి తగ్గిన నిమ్మగడ్డ- వైసీపీ సర్కారుకు భారీ ఊరట

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ సర్కారు ప్రారంభించిన రేషన్ వాహనాలను ఎన్నికల నేపథ్యంలో వాడుకునే విషయంలో ప్రభుత్వానికి భారీ ఊరట దక్కింది. గతంలో ఎస్ఈసీ విధించిన ఆంక్షలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. దీంతో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రేషన్ వాహనాలను తిప్పుకునే అవకాశం దొరికింది.

ఏపీలో స్ధానిక సంస్ధలు జరుగుతున్న వేళ వైసీపీ సర్కారు ప్రారంభించిన రేషన్ పంపిణీ వాహనాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆంక్షలు విధించారు. సీఎం జగన్ ఫొటోతో ఉన్న వాహనాలను తిప్పడం ద్వారా వైసీపీకి అనుచిత లబ్ది చేకూరుతుందని విపక్షాల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసింది. విచారణ జరుగుతున్న తరుణంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

ap sec nimmagada took back his decision on ration vehicles, hc dispose the case

రేషన్‌ వాహనాలను రంగు మార్చి తిప్పుకునేందుకు అభ్యంతరం లేదని తొలుత చెప్పిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తరఫు న్యాయవాదులు, ఆ తర్వాత తమ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో హైకోర్టు పిటిషన్‌ను డిస్పోజ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో స్ధానిక ఎన్నికల వేళ ఈ నిర్ణయం ప్రభుత్వానికి భారీ ఊరటగా మారింది. ప్రభుత్వం ఇంటింటికీ రేషన్‌ వాహనాల ద్వారా పంపిణీ చేస్తుందన్న అంశాన్ని ఓటర్లలోకి తీసుకెళ్లే అవకాశం దక్కింది.

English summary
andhra pradesh high court has disposed a petition filed by the ysrcp govt on ration delivery vehicles after sec nimmagadda ramesh kumar took back his decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X