విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ వెళ్లేందుకు సిద్ధం- మే 31 లోపు పంపాల్సిందే... ఏపీ సచివాలయ ఉద్యోగుల తీర్మానం

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికార వికేంద్రీకరణలో భాగంగా కార్యనిర్వాహక రాజధాని విశాఖకు అమరావతి నుంచి ఉద్యోగుల తరలింపుకు ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి. ఈ మేరకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను ఉద్యోగసంఘాలు అంగీకరించడంతో ఏ క్షణాన్నయినా ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. మే 31లోగా తమను విశాఖకు తరలించాలని ఉద్యోగులు ప్రభుత్వానికి ఓ తీర్మానం పంపనున్నారు.

విశాఖకు ఉద్యోగులు ఓకే..

ఏపీ కార్యానిర్వాహక రాజధాని విశాఖపట్నానికి తరలివెళ్లేందుకు అమరావతి సచివాలయ ఉద్యోగులు అంగీకరించారు. ప్రభుత్వంతో కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చల్లో భాగంగా తమ వద్దకు వచ్చిన ప్రతిపాదనలను చర్చించిన సచివాలయ ఉద్యోగ సంఘం ఈ మేరకు విశాఖ ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా చేపట్టిన విశాఖ తరలింపుకు ఆమోదం తెలుపుతున్నట్లు ఉద్యోగసంఘాలు ఇవాళ ప్రకటించాయి.

Recommended Video

AP Cabinet Employees Are On Duty @ New Capital Visakhapatnam
ap secretariat employees ready to shift to visakhapatnam but before may 31st.


మే 31లోగా తరలించండి..

విశాఖకు తరలి వెళ్లేందుకు సిద్ధమైన సచివాలయ ఉద్యోగసంఘాలు ఈ మేరకు ప్రభుత్వానికి ఓ తీర్మానం పంపనున్నారు. అదే సమయంలో ఈ ఏడాది మే 31లోగా తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని కూడా వారు ప్రభుత్వాన్ని కోరనున్నారు. లేకుంటే విద్యాసంవత్సరం ఆరంభంలో తమకు సమస్యలు తప్పవని వారు ప్రభుత్వానికి విన్నవించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అందిన మిగతా ప్రతిపాదనలను ఆమోదిస్తూనే ఈ అంశాలను కూడా ప్రభుత్వానికి విన్నవించాలని వారు ఇవాళ నిర్ణయించారు.

English summary
ap secretariat employees announced that they will ready to go to new capital visakhapatnam. after employees association meeting, leaders announced that govt will shift them before may 31st only. according to the employees, govt may issue necessary orders very soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X