విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హనుమాన్ ఆలయానికి రూ. కోటి పెద్ద నోట్లు విరాళం

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చెయ్యడంతో దేవాలయాలకు భారీగా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక దేవాలయంలో భారీ మొత్తంలో హుండీలో కానుకలు సమర్పించడంతో ఆలయం నిర్వహకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చెయ్యడంతో దేవాలయాలకు భారీగా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక దేవాలయంలో భారీ మొత్తంలో హుండీలో కానుకలు సమర్పించడంతో ఆలయం నిర్వహకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోని మాచవరంలో శ్రీ దశాంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి నిత్యం భక్తులు వస్తుంటారు. గత నెల నుంచి ఈ దేవాలయానికి రూ. 1 కోటి ఐదు లక్షల రూపాయలు భారీగా విరాళం వచ్చింది.

AP Temple receives massive donations in R.1,000, Rs. 500 notes

హుండీ లెక్కించిన ఆలయం నిర్వహకులు ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల దాదాపుగా భక్తులు రూ. 1,50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు విరాళం ఇస్తుంటారని ఆలయ పూజారి రామక్రిష్ణ మాచార్యులు అంటున్నారు.

ఇప్పుడు వచ్చిన భారీ విరాళంతో ఆలయాన్ని పూర్తిగా అభివృద్ది చేస్తామని ఆలయ నిర్వహాణాధికారి సాంబశివరావు చెప్పారు. ఆంజనేయ స్వామికి వచ్చిన ఒక కోటీ ఐదు లక్షల రూపాయలు అన్ని రూ. 1,000, రూ.500 నోట్లు అని ఆలయ నిర్వహకులు తెలిపారు. పెద్ద నోట్లు రద్దు కావడంతో స్వామివారికి ఈ విధంగా కానుకలు సమర్పించుకుంటున్నారని వారు చెప్పారు.

English summary
Hanuman temple in Andhra Pradesh’s Vijayawada city received a whopping Rs.1 crore and 5 lakh in the past one month after the government scrapped Rs.500 and Rs.1000 currency notes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X