తెలంగాణ తగ్గట్లేదు, కోర్టే తేల్చాలి: ఏపీ సీఎస్, సోమేష్ కుమార్కు 'ఏపీ' చిక్కు
హైదరాబాద్: ఏపీ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగాలను తొలగించిన అంశంపై ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఐవైఆర్ కృష్ణా రావు, తెలంగాణ సిఎస్ రాజీవ్ శర్మలు మంగళవారం నాడు చర్చించారు. అనంతరం ఏపీ సిఎస్ కృష్ణారావు మాట్లాడారు.
విద్యుత్తు ఉద్యోగుల అంశంపై తెలంగాణ సిఎస్తో చర్చించినట్లు చెప్పారు. మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్లో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ భేటీ అయ్యామన్నారు. విద్యుత్తు ఉద్యోగులపై చర్చించేందుకే తెలంగాణ సీఎస్ తనను కలిశారన్నారు.
విద్యుత్తు ఉద్యోగుల అంశంపై తెలంగాణ ప్రభుత్వం తమ పాత వాదనకే కట్టుబడి ఉందని చెప్పారు. ఇక ఈ విద్యుత్తు ఉద్యోగుల సమస్యను కోర్టు తేల్చవలసి ఉందని చెప్పారు.
సోమేష్ కుమార్ పిటిషన్ పైన వాయిదా
జిహెచ్ఎంసి అధికారి సోమేష్ కుమార్ పిటిషన్ పైన విచారణను క్యాట్ రేపటికి వాయిదా వేసింది. సోమేష్ కుమార్ను తెలంగాణలోనే ఉంచాలని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. రేపు కేంద్రం తన వాదనలు వినిపించనుంది. ఉద్యోగుల విభజనలో సోమేష్ కుమార్ ఆంధ్రకు వెళ్లారు.