ఎపిఎన్జీవో సమ్మె: హైకోర్టు బెంచ్ భిన్నాభిప్రాయాలు
ఎపిఎన్జీవోల సమ్మె చట్టవిరుద్దమని వేసింది ప్రజాప్రయోజన వ్యాజ్యమేనని ప్రధాన న్యాయముర్తి చెప్పారు. సమ్మె చట్ట విరుద్ధం వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. అయితే సమ్మెపై వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం చెల్లదని మరో న్యాయమూర్తి భాను చెప్పారు. పిటిషన్దారు గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు.
కాగా, ఎపిఎన్జీవోల సమ్మెపై ద్విసభ్య బెంచ్ నుండి విరుద్ధంగా తీర్పు రావడంతో దానిని త్రిసభ్య బెంచ్కు అప్పగించారు. మరో న్యాయమూర్తి ఎపిఎన్జీవోల సమ్మెపై తీర్పు చెప్పనున్నారు. ఇది ఉత్కంఠగా మారింది.
కాగా, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎపిఎన్జీవోలు ఇటీవల సమ్మె చేసిన విషయం తెలిసిందే. వారు పద్దెనిమిది రోజుల పాటు సమ్మె చేశారు. ఈ సమ్మె చట్టవిరుద్ధమని ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు తీర్పు వెలువడింది.