ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లలో మార్పు: 18 రిక్రూట్ మెంట్లకు సంబంధించి: మెయిన్స్ షెడ్యూల్ రివైజ్డ్..!
ఏపీపీఎస్సీ 2018-19 లో విడుదల చేసిన 18 రిక్రూట్ మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్ లో మార్పులు చేసింది. ఆ నోటిఫికేషన్లకు సంబంధించిన షెడ్యూల్ రివైజ్ అయింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి పీయస్సార్ ఆంజేనేయులు వెల్లడించిన వివరాల మేరకు రివైజ్ చేసిన షెడ్యూల్ లో మార్పులు ప్రకటించారు. అందులో భాగంగా.. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్ పరీక్షలు 03.02.2020, 4.02.202న జరగనుంది. అదే విధంగా డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ పోస్టు కోసం మెయిన్ పరీక్ష తేదీ 05.02.2020, 06.02.2020 గా ఖరారు చేసారు.
పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టు కోసం 17.02.2020 నుండి 20.02.2020 తేదీల్లో జరగనున్నాయి. సంక్షేమ విభాగాల అసిస్టెంట్ పరీక్షల తేదీలను 26.02.2020 తో పాటుగా 27.02.2020న నిర్వహించనున్నారు. రాయల్టీ ఇన్ స్పెక్టర్ పోస్టు కసం 27.02.2020న పరీక్ష జరగనుంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ పోస్టుల పరీక్ష 28.02.2020న నిర్వహించాలని నిర్ణయించారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నికల్ అసిస్టెంట్ కోసం 28.02.2020న పరీక్ష జరగనుంది.
అసిస్టెంట్ డైరెక్టర్ పరీక్ష 28.02.2020న, అదే విధంగా అసిస్టెంట్ కెమిస్ట్ పరీక్ష 28.02.2020న జరగనుంది. టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల కోసం మెయిన్స్ 28.02.2020, 29.02.2020న నిర్వహించనున్నారు. డిగ్రీ కాలేజి లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం మెయిన్స్ పరీక్షను 12.02.2020 తో పాటుగా 13.02.2020న నిర్వహించాలని నిర్ణయించారు. జియో ఫిజిక్్ టెక్నికల్ అసిస్టెంట్ కోంస 27.03.2020, 29.03.2020న జరగనున్నాయి. హౌడ్రోజియోలజీ టెక్నికల్ అసిస్టెంట్ కోసం పరీక్ష్ 28.03.2020న జరగనుంది. వెల్ఫేర్ ఆర్గనైజర్ పరీక్ష తేదీని 28.03.2020న నిర్వహించనున్నారు.
జిల్లా సైనిక సంక్షేమ అధికారుల పోస్టుల పరీక్షను 28.03.2020 తో పాటుగా 29.03.2020న జరగనుంది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం పరీక్షలను 28.03.2020 తో పాటుగా 29.03.2020న నిర్వహించనున్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే పోస్టుల భర్తీ కోసం మెయిన్స్ పరీక్షను 29.03.2020న నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.