వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ : 9న ఆర్టీసీ ఎండీ, కమిషనర్‌కు జేఏసీ నోటీసు

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న ఆర్టీసీ ఎండీ, కార్మికశాఖ కమిషనర్ కు నోటీసు ఇస్తామని ఈయూ సహా 8 కార్మిక సంఘాలు ప్రకటించాయి.

apsrtc jac go to strike : 9th gave notice to rtc md

చర్చలు విఫలం ..
వివిధ అంశాలపై ఫిబ్రవరి 5న మంత్రి అచ్చెన్నాయుడు కార్మిక సంఘం నేతలు చర్చలు జరిపారు. ఇచ్చిన హామీ మేరకు వేతన సవరణ బకాయి నిధులు చెల్లించాలని కోరారు. అయితే ఇప్పటివరకు తమ డిమాండ్ పై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాలు డిసిషన్ తీసుకున్నాయి.

నెరవేర్చని డిమాండ్లు ..
వీటితోపాటు ఆర్టీసీలో అద్దె బస్సుల పెంపును విరమించుకోవాలని కూడా జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ డిమాండ్ పై కూడా సర్కార్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. సిబ్బందిని తగ్గిస్తూ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను కూడా జేఏసీ తప్పుపట్టింది. ఈ చర్యలను వెంటనే నిలిపివేయాని జేఏసీ అల్టిమేటం జారీచేసింది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో .. ఇక తాము సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

English summary
The strike in the APS RTC. The JAC has made a decision to give a strike notice to the government. on 9th of this month 8 unions, including EE, have announced a notice to Md and Labor Commissioner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X