రేపటి నుంచి తిరుమలకు 50 ఆర్టీసీ బస్సులు- దర్శనాల పునరుద్ధరణ నేపథ్యంలో...
జూన్ 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. రేపటి నుంచి తిరుమలకు 50 బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. అయితే ఏయే ప్రాంతాల నుంచి సర్వీసులు నడుపుతారో ఆర్టీసీ వివరాలు విడుదల చేయాల్సి ఉంది.
కరోనా లాక్ డౌన్ మినహాయింపుల్లో భాగంగా జూన్ 11 నుంచి శ్రీవారి దర్శనాలకు భక్తులను అనుమతించాలని టీడీడీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే ముందుజాగ్రత్తగా రేపటి నుంచి ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. టీటీడీ ఉద్యోగులతో పాటు తిరుపతిలో స్ధానికులను ముందుగా ట్రయల్ రన్ పేరుతో దర్శనాలకు అనుమతిస్తారు. వీటిలో లోటుపాట్ల ఆధారంగా జూన్ 8 నుంచి దర్శనాలకు టీటీడీ సమగ్ర ప్రణాళిక విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్