జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటీషన్ పై తెలంగాణా హైకోర్టులో వాదనలు.. సీబీఐ ఏం చెప్పిందంటే
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే . ఇక కేసులో నేడు విచారణ కొనసాగింది. సీబీఐ తరపున న్యాయవాది తమ పక్షాన కౌంటర్ దాఖలు చెయ్యటానికి మరికొంత సమయం కావాలని కోర్టును కోరారు.
అక్రమాస్తుల కేసు.. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో జగన్ పిటీషన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది . ఇక ఈ నేపధ్యంలో తాను ముఖ్యమంత్రి కావటం వల్ల, అధికారిక కార్యక్రమాల ను నిర్వహించే నిమిత్తం వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని పదేపదే విజ్ఞప్తి చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. కానీ కోర్టు నిరాకరించటంతో తెలంగాణా హైకోర్టును ఆశ్రయించారు జగన్ .
సీబీఐ కోర్టు ఇప్పటికి రెండు సార్లు వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటీషన్ ను కొట్టివేసి జగన్ హాజరు కావాలని తేల్చి చెప్పింది.ఇక దీంతో ఆయన ఈసారి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విచారణ ను ఫిబ్రవరి ఆరు కు వాయిదా వేయగా నేడు విచారణ కొనసాగింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ అధికారులు మరింత గడువును కోరారు. దీంతో జగన్ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది హైకోర్టు .