హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటీషన్ పై తెలంగాణా హైకోర్టులో వాదనలు.. సీబీఐ ఏం చెప్పిందంటే

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే . ఇక కేసులో నేడు విచారణ కొనసాగింది. సీబీఐ తరపున న్యాయవాది తమ పక్షాన కౌంటర్ దాఖలు చెయ్యటానికి మరికొంత సమయం కావాలని కోర్టును కోరారు.

అక్రమాస్తుల కేసు.. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో జగన్ పిటీషన్అక్రమాస్తుల కేసు.. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో జగన్ పిటీషన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది . ఇక ఈ నేపధ్యంలో తాను ముఖ్యమంత్రి కావటం వల్ల, అధికారిక కార్యక్రమాల ను నిర్వహించే నిమిత్తం వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని పదేపదే విజ్ఞప్తి చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. కానీ కోర్టు నిరాకరించటంతో తెలంగాణా హైకోర్టును ఆశ్రయించారు జగన్ .

Arguments On Personal Appeal Petition of Jagan in Telangana High Court .. What the CBI said

సీబీఐ కోర్టు ఇప్పటికి రెండు సార్లు వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటీషన్ ను కొట్టివేసి జగన్ హాజరు కావాలని తేల్చి చెప్పింది.ఇక దీంతో ఆయన ఈసారి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విచారణ ను ఫిబ్రవరి ఆరు కు వాయిదా వేయగా నేడు విచారణ కొనసాగింది. కౌంటర్‌ దాఖలు చేసేందుకు సీబీఐ అధికారులు మరింత గడువును కోరారు. దీంతో జగన్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది హైకోర్టు .

English summary
AP CM Jagan Mohan Reddy has approached the High Court for exemption of personal attendance in the improper case in CBI court. The trial of the case continues today. Advocate on behalf of the CBI asked the court for some more time to file a countersuit on their behalf.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X