పటేల్ ఆశయాలతో: ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్
హైదరాబాద్: హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 68వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు. ఐపీఎస్ అధికారులు దిక్షాంత్ పరేడ్ నిర్వహించారు. ఈ బ్యాచ్ లో మొత్తం 109 మంది ట్రైనీ ఐపీఎస్ లు ఈ పరేడ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు. సమాజం కోసం పోలీస్ వ్యవస్థ అహర్నిశలు కష్టపడుతోందని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని జైట్లీ పిలుపునిచ్చారు.
Comments
English summary
Union Minister Arun Jaitley participated in NPA Dikshanth parade in Hyderabad.
Story first published: Saturday, October 29, 2016, 17:24 [IST]