ఫేస్ బుక్ పరిచయం పెళ్ళికి దారితీసింది, చివరికిలా...
ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. ఈ పరిచయం వారిద్దరి మద్య ప్రేమకు దారితీసింది. ప్రేమికులు పెద్దలకు చెప్పకుండా వివాహం చేసుకొన్నారు.అయితే పెళ్లిచేసుకొన్న యువతిని ఆ వరుడు వదిలివెళ్ళడంతో బాధితురాలు అత్తింటి మ
అనంతపురం:ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. ఈ పరిచయం వారిద్దరి మద్య ప్రేమకు దారితీసింది. ప్రేమికులు పెద్దలకు చెప్పకుండా వివాహం చేసుకొన్నారు.అయితే పెళ్లిచేసుకొన్న యువతిని ఆ వరుడు వదిలివెళ్ళడంతో బాధితురాలు అత్తింటి ముందు న్యాయపోరాటానికి దిగింది.
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలానికి చెందిన అరుణశ్రీ అనే యువతితో పెద్దవడుగూరు మండలం ఆవులాంపల్లికి చెందిన సుదర్శన్ ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకొన్నాడు. ఈ పరిచయం వారిద్దరి మద్య ప్రేమకు దారితీసింది.
కర్నూల్ జిల్లాలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో వారిద్దరూ ఈ నెల 10వ, తేదిన వివాహం చేసుకొన్నారు. అయితే పెద్దలకు తెలియకుండానే వివాహం చేసుకోవడంతో తల్లిదండ్రులు వారిని ఇంట్లోకి రానివ్వలేదు.
నూతన వధూవరులు పామిడిలోని ఓ బట్టల దుకాణానికి వచ్చారు. కొత్త బట్టలు కొనుగోలు చేసి వివాహనికి వెళ్ళాలని నిర్ణయించారు. అయితే వస్త్ర దుకాణం వద్దే సుదర్శన్ ఆ యువతిని వదిలేసి వెళ్ళిపోయాడు.
అయితే ఆ యువకుడు ఎంతసేపటికి రాకపోయేసరికి ఆ యువతి ఆవులాంపల్లి గ్రామానికి వెళ్ళి వరుడి ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.అయితే ఆ యువతికి ఇప్పటికే రెండు పెళ్ళిళ్ళు జరిగాయని తన కొడుకును మోసం చేసి మరోసారి వివాహం చేసుకొందని వరుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.మరో వైపు తనకు న్యాయం చేయాలని యువతి అరుణశ్రీ కోరుతోంది.