బైక్పై వచ్చి కాల్పులు, సాఫ్టువేర్ ఉద్యోగుల్లా ఉన్నారు: నాగరాజు
హైదరాబాద్: ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వచ్చి తన పైన కాల్పులు జరిపారని, వారి వేషధారణ సాఫ్టువేర్ ఉద్యోగుల్లా ఉందని జ్యోతిష్కుడు నాగరాజు అన్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాదులోని సరూర్ నగర్లో నాగరాజు పైన కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. గాయపడ్డ నాగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వచ్చి కాల్పులు జరిపారని చెప్పారు. వారు ఐదు రౌండ్లు పేల్చారన్నారు. ప్రాణభయంతో తాను హైదరాబాదులోనే గత ఆరు నెలలుగా ఉంటున్నానని తెలిపారు. తనను వచ్చింది ఇద్దరు వ్యక్తులు అన్నారు.
ఓ వ్యక్తి బైక్ పైన కూర్చోగా, మరో వ్యక్తి తన పైన కాల్పులు జరిపాడన్నారు. వారి వయస్సు ముప్పై ఏళ్లకు అటు, ఇటుగా ఉంటుందన్నారు. లండన్లో ఉంటున్న గోవింద్ తనను చంపేందుకు సుఫారీ ఇచ్చారని ఆరోపించారు. తమ కుటుంబానని అనవసరంగా కేసుల్లో ఇరికించారన్నారు.
తన మామ, బావమరుదులను గోవింద్ వర్గమే పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. దీని పైన సీబీఐ విచారణ జరిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సీబీఐచే విచారణ జరిపించాలని కోరుతున్నానని చెప్పారు.