వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నను గుర్తు చేసుకొని కంటతడి పెట్టిన అచ్చెన్న, అందరికీ ఆదర్శమని రామ్మోహన్

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం కంటతడి పెట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని తమ స్వగ్రామం నిమ్మాడలో ఎర్రన్నాయుడు వర్థంతి కార్యక్రమం నిర్వహించారు.

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం కంటతడి పెట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని తమ స్వగ్రామం నిమ్మాడలో ఎర్రన్నాయుడు వర్థంతి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రితో పాటు ఎంపీ రామ్మోహన్నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడారు. అనునిత్యం ప్రజలతో మమేకమై అలుపెరగని నాయకుడిగా జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసిన ఎర్రన్న ఆశయాలు నెరవేర్చడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు.

 Athcannaidu weeps in Srikakulam

శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనేది తన సోదరుడు ఎర్రన్నాయుడు ఆకాంక్ష అని అచ్చేన్న చెప్పారు. ఇప్పటికే ప్రాధాన్యతా క్రమంలో సాగునీటిని అందిస్తున్నట్లు వెల్లడించారు. రానున్న రెండేళ్లలో ఆయన కలలు పూర్తిగా నెరవేరుస్తామన్నారు.

రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. స్వపక్షాలకు, ప్రతిపక్షాలకు తన తండ్రి ఎర్రన్నాయుడు ఆదర్శమని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం శత్రువులు లేని వ్యక్తిగా ఆయన కొనసాగారని చెప్పారు.

English summary
Athcannaidu weeps in Srikakulam district on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X