నంద్యాలలో మళ్లీ కలకలం: అభిరుచి మధు కారుపై ఎటాక్.. ఎవరు?
ప్రత్యర్థులు మరోసారి అభిరుచి మధును టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మధు ఇంటి వద్ద ఉన్న కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసినట్లు సమాచారం. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై మధు పోలీస్ స్టేషన్ లో ఫి
Recommended Video
నంద్యాల: నిన్న మొన్నటిదాకా ఎవరికీ అంతగా తెలియని అభిరుచి మధు.. శిల్పా వర్గీయులతో ఘర్షణ ద్వారా ఒక్కసారి మీడియాలో హైలైట్ అయ్యాడు. నంద్యాల ఉపఎన్నికవేళ ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవలో కత్తి పట్టుకుని ఆయన హల్ చల్ చేయడంతో.. ఆయన పేరు ఒక్కసారిగా అన్ని ప్రధాన స్రవంతి మీడియా చానెల్స్ లో వినిపించింది.
చంపాలనేదే కోరికైతే ఇంటికే వచ్చి ప్రాణాలిస్తా: మధు; నివురు గప్పిన నిప్పులా నంద్యాల
తాజాగా మరోసారి ప్రత్యర్థులు అభిరుచి మధును టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మధు ఇంటి వద్ద ఉన్న కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసినట్లు సమాచారం. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై మధు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మధు-శిల్పా వర్గీయుల మధ్య వైరం రీత్యా ఈ దాడిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
కాగా, నంద్యాల మాజీ కౌన్సిలర్ భర్త భాషా ఇటీవలే మృతి చెందడంతో ఇటీవల ఆ అంత్యక్రియలకు శిల్పా వర్గీయులు, మధు హాజరయ్యారు. అయితే ఎక్కడ చెడిందో తెలియదు కానీ శిల్పా చక్రపాణి వర్గీయులు మధు కారుపై దాడి చేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో మధు కూడా కత్తితో వారిపై బెదిరింపులకు దిగాడు. హుటాహుటిన పోలీసులు రావడంతో వివాదం సద్దుమణిగింది.