ఆయేషా మీరా హత్య కేసు: ఎట్టకేలకు పునర్విచారణ, సిట్ ఏర్పాటు, పర్యవేక్షక బాధ్యత గౌతమ్ సవాంగ్ కు
సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో పునర్విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ నిమిత్తం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను ఏర్పాటు చేసింది.
అమరావతి: సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో పునర్విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ నిమిత్తం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను ఏర్పాటు చేసింది.
డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. సిట్ పర్యవేక్షక బాధ్యతలను విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ కు ప్రభుత్వం అప్పగించింది.
2007లో విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఓ హాస్టల్లో ఆయేషా మీరా హత్యకు గురైన విషయం, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు నివ్వడం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా ఈ కేసులో మళ్లీ విచారణ జరగనుంది. ఇప్పుడైనా అసలు దోషులు బయటికి వస్తారా? ప్రత్యేక విచారణ బృందా ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఈ కేసులో దోషులను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే!