వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ayodhya verdict : అయోధ్య తీర్పు సందర్భంగా చంద్రబాబు విజ్ఞప్తి

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ayodhya Verdict : Naendra Modi And Chandrababu Appeals During Ayodhya Verdict || Oneindia Telugu

అయోధ్య భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తుది తీర్పు కొద్ది క్షణాల్లో వెల్లడించనున్నది. శనివారం (నవంబర్9వ తేదీన) ఉదయం 10.30 నిమిషాలకు జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెల్లడించనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. నేడు జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ఏ బోబ్డే, డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ లు అయోధ్య వివాదం పై తుది తీర్పును వెల్లడించనున్నారు .

ఎలాంటి ఉద్రిక్తతలకు చోటు లేకుండా శాంతియుత వాతావరణంలో కోర్టు ఇచ్చే తీర్పును అందరు స్వాగతించాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం కూడా మైత్రి, సయోధ్యలను మనం చక్కగా కాపాడుకోవాలని మోడీ కోరారు.

Ayodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపుAyodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపు

Ayodhya verdict: Chandrababu appeals during Ayodhya verdict

ఇక ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో చాలా సున్నితమైన ఈ కేసుపై స్పందించారు. 'అయోధ్య విషయమై తీర్పు వెలువడబోతున్న సందర్భంగా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా అందరం హృదయపూర్వకంగా ఆ తీర్పును స్వీకరించాలి. సంయమనం పాటించాలి, మత సామరస్యం కాపాడాలి. శాంతి, సౌభాతృత్వంతో సమసమాజ నిర్మాణమే మన అంతిమలక్ష్యం కావాలి' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

పార్టీలు వేరైనా అందరు రాజకీయ నేతలు శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలని కోరుకుంటున్న పరిస్థితి తాజా అయోధ్య తీర్పు నేపథ్యంలో ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది ప్రముఖులు ప్రజలందరూ శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా ఉండాలని, తీర్పు ఎలా వచ్చినా దానిని స్వీకరించేందుకు అందరూ సన్నద్ధంగా ఉండాలని పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది.

English summary
In the wake of the Ayodhya verdict today, chandrababu responded on twitter platform .. My appeal to all people is to be judged on the issue of Ayodhya. Whatever receives the verdict should accept the verdict heartfullly. Abstinence must be practiced and religious harmony maintained. Our ultimate goal is to build a balanced society with peace and harmony, ”Chandrababu tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X