వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కదులుతున్న రైలు నుండి కిందపడిన యువతి: 6 గంటల నరకయాతన

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఏలూరు: కదులుతున్న రైలులో నుండి ఓ యువతి జారి బురదలో పడిపోయింది. సుమారు 6 గంటలకు పైగా బురదలోనే సహయం కోసం ఎదురు చూసింది. రైల్వే గ్యాంగ్‌మెన్ ఆమెను చూడడంతో ఆమె ప్రాణాలు దక్కించుకొంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం నాడు చోటు చేసుకొంది.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రాజేశ్వరి విజయవాడ నుండి పూరీ ఎక్స్‌ప్రెస్‌లో స్వంత ఊరికి బయలుదేరింది.

B.Ed student falls from train, condition critical

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు- గుమ్ములూరు వద్ద ఆమె రైలు తలుపువద్ద నిలబడింది. ప్రమాదవశాత్తు రైలు నుండి కాలుజారి కిందపడిపోయింది. అయితే రాజేశ్వరి కిందపడిన ప్రాంతంలో బురద ఎక్కువగా ఉంది. దీంతో ఆమె ఆ బురదలోనే కూరుకుపోయింది.

ఉదయం 9 గంటల సమయంలో ఆ యువతి రైలు నుండి కిందపడిపోయింది. దీంతో బురదలో సుమారు 6 గంటలకు పైగా ఉంది. అయితే రైల్వే గ్యాంగ్ మెన్ పట్టాలను తనిఖీ చేస్తూ ఆ దారిగుండా ప్రయాణం చేస్తున్నాడు.

అయితే బురదలో కూరుకుపోయిన ఆ యువతిని అతను చూశారు. ఇతరుల సహయంతో ఆమెను బురద నుండి బయటకు తీశారు. బాధితురాలికి సపర్యలు చేశారు.అంబులెన్స్‌ను పిలిపించి ఆసుపత్రికి తరలించారు. .ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది.

English summary
The keyman and the trackmen of the South Central Railway (SCR) rescued a passenger, J. Rajeshwari, who reportedly fell from a moving train near Akiveedu. She suffered critical injuries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X