మహానాడులో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ చంద్రబాబే...
అమరావతిలో జరుగుతున్న తెలుగుతమ్ముళ్ల జెండా పండుగలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎటూ చూసినా కార్యకర్తలు జెండా పట్టుకొని కేరింతలు కొట్టడం కనిపించింది. దేశ్ కి నేత చంద్రబాబు అంటూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చంద్రబాబుకు స్వాగతం పలకడం విశేషం.
కర్ణాటక ఎన్నికల సందర్బంగా చంద్రబాబు జాతీయ నాయకులతో జరిపిన సంప్రదింపుల వల్ల దేశ రాజకీయాల్లో చంద్రబాబు మరో సారి చక్రం తిప్పబోతున్నారంటూ కార్యకర్తల్లో తారా స్థాయిలో చర్చజరుగుతోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న మహానాడులో పార్టీ శ్రేణులు ఆకాశమే హద్దుగా నినాదిస్తున్నారు.
అమరావతి నగరం మొత్తం చంద్రబాబు ఫ్లెక్సీలతో అలంకరించారు. భారతీయ జనతా పార్టీ ఆంద్రప్రదేశ్ ని ఎందుకు చిన్నచూపు చూస్తోంది, ఎందుకు కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలగాల్సి వచ్చిందో పార్టీ శ్రేణులకు బాబు వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ పోషించబోయే కీలక పాత్ర గురించి చంద్రబాబు ప్రసంగించబోతున్నారు. చంద్రబాబు స్పీచ్ కోసం కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్టు సమాచారం..