అమితాబ్ ఏం పీకారు? చిరంజీవి.??, నా బ్లడ్, బ్రీడ్ వేరే: బాలకృష్ణ సంచలనం
బాలీవుడ్ మెగాస్టార్, మాజీ ఎంపీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్, ఎంపీ చిరంజీవిలపై ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్, మాజీ ఎంపీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్, ఎంపీ చిరంజీవిలపై ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలపై ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారిపై అనుచితమైన పదజాలం వాడారు.
రాజకీయాలు సులభం కాదు..
రాజకీయాలంటే సినిమాలంతా సులభం కాదని బాలకృష్ణ అన్నారు. తాను సినీ తారలను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ ఆహ్వానించనని అన్నారు. తమిళనాడు, ఏపీలో పలువురు సినీతారలు రాజకీయాల్లోకి వస్తున్నారని, మీరు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారని.. పవన్ కళ్యాణ్ కూడా వచ్చారని.. మీరు కొత్త వారిని రాజకీయాల్లోకి స్వాగతిస్తారా? అని ప్రశ్నించగా.. ఈ మేరకు స్పందించారు బాలకృష్ణ.
అమితాబ్ ఏం పీకారు..?
పాలిటిక్స్ అల్వేస్ గ్రూమింగ్.. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఎమోషనల్ అని, అదొక రామారావు వల్లే అయిందని, అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకారని ప్రశ్నించారు బాలకృష్ణ. ఒక గొప్ప రాజకీయ నాయకుడ్ని ఓడించారని అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని అహ్మదాబాద్కు బహుగుణ ఉండి ఉంటే ఎంతో ప్రజా సేవ చేసేవారని అన్నారు.
ఫొటోలు తప్ప ఏమీ చేయలేదు..
బహుగుణను ఓడించి పార్లమెంటుకు వెళ్లిన అమితాబ్.. అక్కడ కూడా ఆటోగ్రాఫ్లు ఇవ్వడం, ఫొటోలు దిగడం తప్ప ఏమీ చేయలేదని బాలకృష్ణ అన్నారు. పాలిటిక్స్ అంటే సినిమాలా కాదని, అందరూ అనుకుంటున్నట్లు కాదని చెప్పారు.
రాజకీయాల్లోకి వచ్చి చిరంజీవి...?
అంతేగాక, రాజకీయాలు అందరికీ సాధ్యం కాదని అన్న బాలకృష్ణ.. చిరంజీవి ఏం చేశారన్నట్లుగా భావం వ్యక్తీకరించారు. అందరూ రాజకీయాల్లో రాణించలేరని, కావాలంటే తాను రాసిస్తానని బాలకృష్ణ అన్నారు.
నా బ్లడ్, బ్రీడ్ వేరే...!
‘మేము వేరు.. నా బ్లడ్ వేరు.. మా బ్రీడ్ వేరు.. సస్టెయినబిలిటీ ఉంది మాలో...' అని చెప్పారు. కాగా, ప్రస్తుతం బాలకృష్ణ ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. దీంతో చిరంజీవి, అమితాబ్ అభిమానులు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సందేశాలు పంపుతున్నారు. అయితే, గతంలో ఒకసారి అమితాబ్ను కలిసిన సందర్భంలో బాలకృష్ణ పాదాభివందనం చేసిన విషయం తెలిసిందే.