జగన్ హంగామా: అమరావతికి 'జై బాలయ్య' ఇటుకలు (ఫోటోలు)
అమరావతి: హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్ఫూర్తితో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి తమ వంతుగా లక్ష ఇటుకులను అందజేస్తున్నట్లు అనంతపురం ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అద్యక్షుడు జగన్ తెలిపారు.
ప్రతి ఇటుకపై కూడా జై బాలయ్య అని వ్రాసి నందమూరి బాలకృష్ణ చేతుల మీదగా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఆనాడు వానర సైన్యం ప్రతి రాయిపైన జై శ్రీరామ అంటూ వ్రాసి వారధి నిర్మించారు.
ఈనాడు బాలయ్య సైన్యం లక్ష ఇటుకలపై జై బాలయ్య అని వ్రాసి ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములవుతామని తెలిపారు. ఇటుక తయారీ పూర్తి కాగానే ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ టీం, బాలయ్య అభిమానులు, మిత్రులు మరియు శ్రేయోభిలాసులు భారీ ర్యాలీగా వెళ్లి మన ఆంధ్రులు కలలు కన్న నవ్యాంధ్ర నిర్మాణానికి అమరావతిలో అందజేస్తామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతారని, అన్నిరంగాలలో అభివృద్ది చేయగలరని తెలిపారు. అవసరమైతే తామంతా ఒక్క నెల రోజులు 'రోజు కూలీ'గా కూడా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు.
ఫ్యాన్స్ హంగామా: అమరావతికి 'జై బాలయ్య' ఇటుకలు
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్ఫూర్తితో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి తమ వంతుగా లక్ష ఇటుకులను అందజేస్తున్నట్లు అనంతపురం ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అద్యక్షుడు జగన్ తెలిపారు.
ఫ్యాన్స్ హంగామా: అమరావతికి 'జై బాలయ్య' ఇటుకలు
ప్రతి ఇటుకపై కూడా జై బాలయ్య అని వ్రాసి నందమూరి బాలకృష్ణ చేతుల మీదగా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఆనాడు వానర సైన్యం ప్రతి రాయిపైన జై శ్రీరామ అంటూ వ్రాసి వారధి నిర్మించారు.
ఫ్యాన్స్ హంగామా: అమరావతికి 'జై బాలయ్య' ఇటుకలు
ఈనాడు బాలయ్య సైన్యం లక్ష ఇటుకలపై జై బాలయ్య అని వ్రాసి ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములవుతామని తెలిపారు. ఇటుక తయారీ పూర్తి కాగానే ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ టీం, బాలయ్య అభిమానులు, మిత్రులు మరియు శ్రేయోభిలాసులు భారీ ర్యాలీగా వెళ్లి మన ఆంధ్రులు కలలు కన్న నవ్యాంధ్ర నిర్మాణానికి అమరావతిలో అందజేస్తామన్నారు.
ఫ్యాన్స్ హంగామా: అమరావతికి 'జై బాలయ్య' ఇటుకలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతారని, అన్నిరంగాలలో అభివృద్ది చేయగలరని తెలిపారు. అవసరమైతే తామంతా ఒక్క నెల రోజులు 'రోజు కూలీ'గా కూడా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు.