హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుతో భేటీ, పీఏకు బాలకృష్ణ షాక్! తమ్ముళ్ల ఒత్తిడితో తొలగింపుకు రెడీ

హిందూపురం శాసన సభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ మంగళవారం నాడు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: హిందూపురం శాసన సభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ మంగళవారం నాడు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. తన పీఏ శేఖర్ వ్యవహారమై చర్చించి, ఆయనను తొలగించాలని వారు ఇరువురు నిర్ణయించారని తెలుస్తోంది.

బాలకృష్ణ పీఏ వ్యవహారం గత కొద్ది రోజులుగా హిందూపురంలో హాట్‌గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఆయనను తొలగించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో బాలకృష్ణ భేటీ కావడం గమనార్హం.

<strong>పీఏ శేఖర్ గొడవ: హిందూపురం రగడపై బాలకృష్ణ గట్టి వార్నింగ్</strong>పీఏ శేఖర్ గొడవ: హిందూపురం రగడపై బాలకృష్ణ గట్టి వార్నింగ్

Balakrishna meets Chandrababu, PA may removed

ఈ సందర్భంగా పీఏ చంద్రశేఖర్‌ను తొలగించాలనే నిర్ణయించారు. నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు, నేతలు ఆయన ఉండవద్దని ఇప్పటికే బాలకృష్ణకు అల్టిమేటం జారీ చేసినంత పని చేశారు. ఈ నేపథ్యంలో తగ్గక తప్పటం లేదని అంటున్నారు.

మరోవైపు, ఎన్టీఆర్ జీవితం ఆధారంగా సినిమా తీస్తామని బాలకృష్ణ సోమవారం నాడు చెప్పారు. దీని పైన కూడా చంద్రబాబు - బాలకృష్ణల మధ్య చర్చ జరిగింది. ఎన్టీఆర్ సన్నిహితులు, సమకాలీనులతో ఈ విషయమై చర్చించాలని బాలకృష్ణకు చంద్రబాబు సూచించారు. అలాగే, నియోజకవర్గ పనుల పైనా చర్చించారు.

English summary
Hindupuram MLA Nandamuri Balakrishna has met Chief Minister Chandrababu Naidu on Tuesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X