అన్న మృతిని నమ్మలేకపోతున్నా, అందరం పోవాల్సినవాళ్లమే కానీ: బాలకృష్ణ భావోద్వేగం
హైదరాబాద్/అమరావతి: తన అన్నయ్య హరికృష్ణ చనిపోవడాన్ని తాను నమ్మలేకపోతున్నామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ మృతి తమ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టిందన్నారు. ఆయన అందరితోను కలుపుగోలుగా ఉండేవారన్నారని బావోద్వేగానికి లోనయ్యారు.
Recommended Video
తన అన్న లేకపోవడం తమ కుటుంబానికి, పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన అచ్చం నాన్నలాగే హుందాగా ఉండేవారన్నారు. ఆయనలో తండ్రిని చూసుకునేవాళ్లమన్నారు. సంస్కృతి, సంప్రదాయం, బంధుత్వానికి ప్రాధాన్యం ఇచ్చేవారని చెప్పారు. ఆయన లేరన్న విషయాన్ని నమ్మకలేకపోతున్నామన్నారు. పార్టీలోను అందరిని కలుపుకుపోయేవారన్నారు.
తమ ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు వస్తుండేవారని, అన్నను చూస్తుంటే తండ్రిని చూస్తున్నట్టే ఉండేదన్నారు. అందరూ పోవాల్సిన వాళ్లేమని, కానీ ఇలా చనిపోవడం బాధాకరంగా ఉందన్నారు. నమ్మబుద్ధి కావడంలేదన్నారు.
మామయ్య హరికృష్ణ మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. హరికృష్ణ మానవతావాది అని, నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెప్పేవారన్నారు.