బిజెపిపై యుద్ధం చేస్తున్నాం: బాలకృష్ణ, తొందరెందుకని సుమన్
అనంతపురం/ నెల్లూరు: రాష్ట్రానికి మొండిచేయి చూపుతున్న బిజెపిపై యుద్ధం చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణ అన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులను కేంద్రం ఇవ్వడం లేదని అన్నారు.
అనంతపురం జిల్లా లేపాక్షి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కొడికొండ చెక్ పస్టు నుంచి లేపాక్ి నంది విగ్రహం వరకు ఆయన సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఎపిలోని వెనుకబడిన నాలుగు రాయలసీమ జిల్లాలకు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు 2014-15 ఆర్థిక సంవత్సరంలోకేంద్రం1050 కోట్ల రూపాయలు ఇచ్చింందని, వాటిలో ఇప్పటి వరకు రూ.954 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. ఇప్పుడు వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వకుండా కేంద్రం జాప్యం చేస్తోందని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇంకా సమయం ఉందని, ఈలోగా ఎందుకు తొందరపడుతున్నారని సినీ నటుడు సుమన్ అన్నారు. నెల్లూరులోని పురమందిరంలో ఆయన ఆదివారం సింహపురి సంస్కృతి సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఉగాది పురస్కరాన్ని అందుకున్నారు.
హోదా కోసం ఇంకా ఏడాది గడువు ఉందని, ఆ లోగానే నలుగురు నాలుగు వైపులా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు.