చంద్రబాబు ఇంటికి బాలినేని రూ. 2 కోట్లు ఆఫర్
రెండు సార్లు ప్రజలు తిరస్కరించినప్పటికీ చంద్రబాబు ఇప్పటికీ చిత్తశుద్ధితో, నిజాయితీతో వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఆస్తుల ప్రకటన బూటకమని ఆయన అన్నారు. చంద్రబాబు తన ఆస్తులను ఇప్పుడు ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు ప్రకటించిన ఆస్తి విలువ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబు తన ఆస్తుల విలువను 42 కోట్ల రూపాయలుగా ప్రకటించడం ఏదో విధంగా నిజాయితీపరుడిని అని చెప్పుకోవడానికేనని ఆయన అన్నారు. ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు చంద్రబాబు ఆస్తులను ప్రకటించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని బాలినేని వ్యాఖ్యానించారు.
నిజాయితీపరుడినని చంద్రబాబు తనకు తాను చెప్పుకోవడం కాదని, ప్రజలు చెప్పుకోవాలని ఆయన అన్నారు. చంద్రబాబు తీరుపై ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. శానససభ ఎన్నికల్లో చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. నిజాయితీపరుడిని అని నిరూపించుకోవాలంటే చంద్రబాబు విచారణకు సిద్ధపడాలని ఆయన అన్నారు.