బ్యాంకు పరీక్షలు ఇకనుండి తెలుగులో...
బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యె విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై బ్యాంకు ఉద్యోగాల కోసం ఇంగ్లీష్,హిందీల్లో కాకుండా ప్రాంతీయ బాషల్లో పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈనేపథ్యంలోనే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రకటించారు.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నిర్వహించే బ్యాంకు ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలను ఇంగ్లీష్ లేదా హిందీ బాషల్లోనే రాయాల్సి ఉండేది. దీంతో సబ్జెక్టు ఉండి బాషపై పట్టులేక పలువురు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ ప్రభుత్వం పేర్కోంది.మరోవైపు ప్రాంతీయ బాషల్లో చదువుకున్న విద్యార్థులు సైతం బ్యాంకు ఉద్యోగాలను పోందేందుకు ఇబ్బంది పడేవారు.
ఈ నేపథ్యంలోనే ఇక నుండి నిర్వహించే బ్యాంకు ఉద్యోగాలను ఇంగ్లీష్, హిందీతోపాటు 13 ప్రాంతీయ బాషల్లో నిర్వహించనున్నారు. దీంతో పలు రాష్ట్రాల నిరుద్యోగులకు మేలు జరగనుంది.ఇక పదమూడు బాషల్లో తెలుగులో కూడ ఉండడంతో రెండు రాష్ట్రాల విద్యార్థులకు మరింత సులువు కానుంది.