వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కులాల మధ్య జగన్ చిచ్చు, కెసిఆర్కు మతిభ్రమించింది: జవహర్
కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ ఆరోపించారు.
విజయవాడ: కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ ఆరోపించారు.
ఆదివారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. మందకృష్ణమాదిగను , ముద్రగడ పద్మనాభాన్ని జగన్ రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఉద్యోగుల పట్ల చంద్రబాబునాయుడు వ్యతిరేకంగా ఉన్నారనే తప్పుడు ప్రచారాన్ని వైసీపీ చేస్తోందని ఆయన విమర్శించారు.
తెలంగాణ సీఎం కెసిఆర్... తన పాంహౌస్ పేరును జ్యోతిషాలయం అని మార్చుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. కెసిఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని చెప్పారు. తెలంగాణలో పరిపాలన చేతకాక పక్క రాష్ట్రంపై పడ్డారని ఆయన దుయ్యబట్టారు.
Comments
English summary
Behind the Kapu reservation , Mrps protests Ysrcp chief Ys Jagan.. said Ap minister Jawahar.He spoke to media at Vijayawada on Sunday.
Story first published: Sunday, July 30, 2017, 14:43 [IST]