ట్రంప్ వర్సెస్ హిల్లరీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఏపీలో రూ.కోట్ల బెట్టింగ్
అమరావతి: అమెరికాలో మరి కొద్ది గంటల్లో ఓటింగ్ ప్రారంభం కానుంది. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్లు పోటీ పడుతున్నారు. ఎక్కువ సర్వేలు హిల్లరీ క్లింటన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎన్నికల వేడి కనిపిస్తోంది.
ఏపీలోను అదే కనిపిస్తోంది. హిల్లరీ, ట్రంప్ గెలుపుల పైన ఏపీలో బెట్టింగులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అమెరికాలో సెటీలైన తెలుగువాళ్లు చాలామంది ఉన్నారు. సర్వేల్లో చాలామంది హిల్లరీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగ భద్రతను కోరుకునే వారు హిల్లరీ వైపు మొగ్గు చూపుతున్నారు.
చాలామంది హిల్లరీ గెలవాలని కోరుకుంటున్నారు. అమెరికా ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి. వీటిపై ఏపీలోని పలుచోట్ల బెట్టింగులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. భీమవరం, పాలకొల్లు, ఏలూరు.. ఇలా పలు ప్రాంతాల్లో బెట్టింగులు కడుతున్నారట. హిల్లరీకి అనుకూలంగా నాలుగైదు చోట్ల కోట్లాది రూపాయల బెట్టింగు జరిగిందని తెలుస్తోంది.
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు విజయావకాశాలు 90 శాతం ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దానికి అనుగుణంగానే తొలి ఫలితం వెలున్యూ హ్యాంప్షైర్లోని డిగ్జ్విల్లే నాచ్లో పోలింగ్ పూర్తయి ఫలితం వచ్చింది. ఇక్కడి ఎనిమిది ఓట్లలో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ నాలుగు ఓట్లు గెలుచుకోగా, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండు ఓట్లు గెలుచుకున్నారు.