అఖిలప్రియ ఇంట పెళ్లి సందడి: రేపు పెళ్లికి 50వేలమంది వరకు హాజరు
ఆళ్లగడ్డ: భూమా ఇంట్లో పెళ్లి సందడి ప్రారంభమైంది. సోమవారం రాత్రి మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు భూమా అఖిలప్రియ, పెళ్లి కొడుకు భార్గవ రామ్ల మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంటికి వచ్చిన బంధువులకు ఎన్నో రకాల విందు వంటకాలు వడ్డించారు.
భూమా అఖిలప్రియ మా ఎస్వీ మోహన్ రెడ్డి, అన్న భూమా బ్రహ్మానంద రెడ్డి పెళ్లి వేడుకలను దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. వచ్చిన అతిథులను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఆళ్లగడ్డలో ఈ నెల 29న పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు తదితరులు రానున్నారు.
Recommended Video
వీరి పెళ్లి కోటకందుకూరు మెట్ట వద్ద గల భూమా శోభానాగిరెడ్డి మెమోరియల్ ఇంజినీరింగ్ కళాశాలల్లో పెళ్లి జరగనుంది. పెళ్లికి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 50వేల మంది హాజరు కావొచ్చునని అంచనా వేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు, ఇరు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. కళ్యాణమండపంలో 5వేల మంది వీఐపీలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.