వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ సెకన్ నుంచే, ఏం చేస్తాడనుకుంటే పిడుగు అయ్యారు: అఖిలప్రియ

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి పోటీ ఎందుకు పెట్టిందంటే, ఎమ్మెల్యే టిక్కెట్ కోసమే తప్ప, మీ కోసం కాదని ప్రజలను ఉద్దేశించి మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి పోటీ ఎందుకు పెట్టిందంటే, ఎమ్మెల్యే టిక్కెట్ కోసమే తప్ప, మీ కోసం కాదని ప్రజలను ఉద్దేశించి మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.

పవన్ కళ్యాణ్ 'కీ'లకం, చెప్తే వీరంతా రెడీ: ఫ్యాన్స్‌కు జగన్ పార్టీ గాలం ఇలాపవన్ కళ్యాణ్ 'కీ'లకం, చెప్తే వీరంతా రెడీ: ఫ్యాన్స్‌కు జగన్ పార్టీ గాలం ఇలా

బుధవారం సోదరుడు బ్రహ్మానంద రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆమె మాట్లాడారు. రోడ్లులేక, విస్తరణ కాక, పింఛన్లు.. రేషన్‌ కార్డులు అందక, పేదలకు ఇళ్లు ఇవ్వక 13 ఏళ్లు నంద్యాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు.

కొత్తగా వచ్చిన మేం ఫ్యాక్షనిస్టులమా

కొత్తగా వచ్చిన మేం ఫ్యాక్షనిస్టులమా

రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన తమను వైసిపి ఫ్యాక్షనిస్టులు అనడం విడ్డూరంగా ఉందని అఖిలప్రియ ఎద్దేవా చేశారు. గుండాయిజం చేసింది ఎవరో ప్రజలకు తెలుసునని చెప్పారు. నంద్యాలలో ఎస్సీలు, ముస్లింలపై కేసులు పెట్టింది మీరా? మేమా? అని శిల్పా మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.

Recommended Video

Chandrababu Gave Promise to Bhuma Akhila Priya Over Nandyal MP
శిల్పా గెలుస్తాడనే ఆలోచనే..

శిల్పా గెలుస్తాడనే ఆలోచనే..

నంద్యాల ఉప ఎన్నికలో జరుగుతున్న పోటీ నీతికి-అవినీతికి అని, మంచికి, చెడుకు అని అఖిలప్రియ అన్నారు. టిడిపికి ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. వైసిపికి ఓటు వేసినా శిల్పా గెలుస్తాడన్న ఆలోచన వచ్చినా మళ్లీ నంద్యాల పదమూడేళ్లు వెనక్కి పోతుందన్నారు.

ఈ సెకన్ నుంచే

ఈ సెకన్ నుంచే

భూమా బ్రహ్మానంద రెడ్డి నామినేషన్‌ వేసిన సెకను నుంచి శిల్పా మోహన్ రెడ్డికి కౌంట్‌డౌన్‌ మొదలైందని అఖిలప్రియ అన్నారు. అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైసిపి ఓటు అడగడానికి వస్తే.. శిల్పా మోహన్ రెడ్డి ఏం చేశారని ఓటు అడగడానికి వచ్చారని నిలదీయాలన్నారు.

భూమా నాగిరెడ్డిని అలా అన్నారు

భూమా నాగిరెడ్డిని అలా అన్నారు

ఆ రోజు భూమా నాగిరెడ్డి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పుడు ఏం చేస్తాడు అన్నారని, ఈ రోజు ఆ నాగిరెడ్డే రాష్ట్రంలో పిడుగులా తయారయ్యారని అఖిలప్రియ అన్నారు. మా వెంట మీరున్నారన్న ధైర్యంతోనే ఉన్నామని, మీ పిల్లల్లా మా బాగోగుల్ని చూడాలని కోరారు.

జల్లెడ పడితే వడ్ల గింజల్లా రాలిపోతారు

జల్లెడ పడితే వడ్ల గింజల్లా రాలిపోతారు

బ్రహ్మానంద రెడ్డి నామినేషన్ ర్యాలీకి తరలివచ్చిన జనాల్ని చూస్తే వైసిపి నాయకుల్లో వణుకు పుడుతుందని కేఈ కృష్ణమూర్తి అన్నారు. జల్లెడ పడితే వడ్ల గింజల్లా రాలిపోతారన్నారు. చంద్రబాబు ఏం హామీలిచ్చారో వాటిని తూచా తప్పకుండా పూర్తి చేస్తామన్నారు. నంద్యాలకు భూమా కుటుంబం చేస్తోన్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు.

English summary
Minister Bhuma Akhila Priya on Wednesday said that they are new for politics. Our brother Bhuma Brahmananda Reddy will win in Nandyal bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X