వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్! వారికి నేనున్నా: బ్రహ్మానందరెడ్డి, అఖిల కంటతడి, చూపిస్తా: చక్రపాణి రెడ్డి హెచ్చరిక

టిడిపి నంద్యాల ఉప ఎన్నికల అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: టిడిపి నంద్యాల ఉప ఎన్నికల అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.

'జగన్ కడపలో బాబాయిని గెలిపించలేదు కానీ', రెండోసారి.. బాబుకు శిల్పా చేయి'జగన్ కడపలో బాబాయిని గెలిపించలేదు కానీ', రెండోసారి.. బాబుకు శిల్పా చేయి

దీంతో ఆయన సోదరి, మంత్రి అఖిలప్రియ, మరో సోదరి మౌనిక కంటతడి పెట్టారు. బ్రహ్మానంద రెడ్డి నామినేషన్ వేసిన సమయంలో మంత్రులు కేఈ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులు, టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డిలు ఉన్నారు.

నా సోదరి అఖిలప్రియకు ఎవరూ లేరనుకోవద్దు: బ్రహ్మానంద రెడ్డి

నా సోదరి అఖిలప్రియకు ఎవరూ లేరనుకోవద్దు: బ్రహ్మానంద రెడ్డి

భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఎవరూ లేరని అనుకోవద్దని భూమా బ్రహ్మానంద రెడ్డి వైసిపిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నా చెల్లెళ్లు, తమ్ముడికి నేను అండగా ఉన్నానని చెప్పారు. ఈ సమయంలో అఖిలప్రియ, మౌనికలు కంటతడి పెట్టారు.

అఖిలకు ఊరట: టిడిపిలోకి 'రెడ్డి' నాయకులు!అఖిలకు ఊరట: టిడిపిలోకి 'రెడ్డి' నాయకులు!

Recommended Video

Chandrababu Gave Promise to Bhuma Akhila Priya Over Nandyal MP
చంద్రబాబును దులిపేసిన చక్రపాణి రెడ్డి

చంద్రబాబును దులిపేసిన చక్రపాణి రెడ్డి

టిడిపికి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణి రెడ్డి బుధవారం సీఎం చంద్రబాబు దుమ్ము దులిపారు. టిడిపిలో తనను తీవ్రంగా అవమానించారని ధ్వజమెత్తారు. తాను టిడిపితో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా చంద్రబాబుకు పంపించినట్లు చెప్పారు.

అఖిలప్రియ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు

అఖిలప్రియ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు

మంత్రి అఖిలప్రియ సహా టిడిపి నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని చక్రపాణి రెడ్డి ధ్వజమెత్తారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. చీమకు కూడా తమ సోదరుడు హానీ చేయడన్నారు.

మేమేంటో చూపిస్తాం

మేమేంటో చూపిస్తాం

నంద్యాల ఉప ఎన్నికల ద్వారా మేమేంటో చూపిస్తామని చక్రపాణి రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో మోహన్ రెడ్డిని గెలిపించి, జగన్‌కు దీనిని కానుకగా ఇస్తామని చెప్పారు. టిడిపిలో తనను తీవ్రంగా అవమానించారన్నారు. పార్టీని భుజాలపై పెట్టుకొని మోశానని చెప్పారు.

రేపు వైసిపిలో చేరుతున్నా

రేపు వైసిపిలో చేరుతున్నా

రేపు నంద్యాల బహిరంగ సభలో వైయస్ జగన్ సమక్షంలో తాను వైసిపిలో చేరుతానని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారు. సాయంత్రంలోగా జగన్‌ను కలుస్తానని, ఏ పార్టీలో ఉన్నా పార్టీ కోసం నిబద్దతతో పని చేశారని చెప్పారు. అలాగే రెండేళ్లు టిడిపి బలోపేతం కోసం పని చేశానని చెప్పారు.

అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు

అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు

డబ్బులకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు కూడా తమ పైన విమర్శలు చేస్తున్నారని చక్రపాణి రెడ్డి మండిపడ్డారు. రాజీనామాను జేబులో పెట్టుకొని తిరుగుతున్నానని, దమ్ముంటే అందరం కలిసి రాజీనామా చేద్దాం రండి అన్నారు.

English summary
Telugu Desam Party leader Bhuma Brahmananda Reddy on Wednesday filed nomination for Nandyal bypoll. Silpa Chakrapani Reddy will join YSR Congress Party on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X