శిల్ప ఏం చేశారు?, వారి మాటలు నమ్మొద్దు: బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి నంద్యాలను ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.
నంద్యాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. అభివృద్ధి నిరోధకుల మాటలను నమ్మి మోసపోవద్దని ఓటర్లకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఉప ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో నంద్యాలలో ఇరు పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ తరపున ఎమ్మెల్యేలు, మంత్రులు నంద్యాలలో పర్యటిస్తుండగా, వైసీపీ కూడా ప్రచారాన్ని జోరుగా సాగిస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు, ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా నంద్యాలలో పర్యటించి ప్రచారం నిర్వహించారు.