వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిలో కంఫర్ట్, టిక్కెట్టు కోసం కుటుంబానిది ఒకేమాట, అంతా ఒట్టిదే: అఖిలప్రియ

తెలుగుదేశం పార్టీలో తాను చాలా కంఫర్ట్‌గా ఉన్నానని ఏపీ టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు. నంద్యాల అసెంబ్లీ స్థానంలో టిడిపి 30వేల మెజారిటీతో విజయం సాధిస్తోందని ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.వ

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: తెలుగుదేశం పార్టీలో తాను చాలా కంఫర్ట్‌గా ఉన్నానని ఏపీ టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు. నంద్యాల అసెంబ్లీ స్థానంలో టిడిపి 30వేల మెజారిటీతో విజయం సాధిస్తోందని ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.విశాఖపట్టణంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా భూమా బ్రహ్మనందరెడ్డి బరిలో ఉన్నారు. ఈ స్థానం నుండి వైసీపీ తన అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డిని బరిలోకి దింపింది.

Recommended Video

YS Jagan Shock To Bhuma Akhila Priya

భూమా నాగిరెడ్డి మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నికలు అవసరమయ్యాయి. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ తరుణంలోనే అధికార, విపక్షాలు విజయం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం సాధించే లక్ష్యంగా భూమా అఖిలప్రియ పావులు కదుపుతున్నారు. తన తండ్రి గత ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే గృహనిర్మాణ పథకం, రోడ్ల విస్తరణలాంటి కార్యక్రమాలను చేపట్టారు.

English summary
Tdp candidate Bhuma brahmananda reddy will win 30,000 majority in Nandyala by poll said Ap tourism minister Bhuma Akhilapriya.she spoke to media in Vishakapatnam on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X