వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా వాళ్లనే పంపేస్తారా?: భూమా మౌనిక హల్‌చల్, శిల్పాను అడ్డుకోవడంతో..

నంద్యాల ఉప ఎన్నికలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అధికార, విపక్షాల నేతలు పోలింగ్ బూత్‌లలోకి వెళ్తున్నారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా బయటకు తీసుకు వస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అధికార, విపక్షాల నేతలు పోలింగ్ బూత్‌లలోకి వెళ్తున్నారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా బయటకు తీసుకు వస్తున్నారు.

భూమా మౌనిక పోలింగ్ బూత్‌ల్లోకి ఎందుకు వెళ్లారంటే! గొడవలపై శిల్పా వ్యాఖ్యభూమా మౌనిక పోలింగ్ బూత్‌ల్లోకి ఎందుకు వెళ్లారంటే! గొడవలపై శిల్పా వ్యాఖ్య

టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి సోదరి భూమా నాగ మౌనిక పోలింగ్ బూత్‌ల వద్ద హల్‌చల్ చేస్తున్నారు. ఉదయం నుంచి మౌనికా రెడ్డి పోలింగ్ బూత్‌లు తిరుగుతున్నారు.

భూమా మౌనికపై వైసిపి సంచలన ఆరోపణలు, ఫోన్ నెంబర్లు ఇచ్చారుభూమా మౌనికపై వైసిపి సంచలన ఆరోపణలు, ఫోన్ నెంబర్లు ఇచ్చారు

అనుచరులతో కలిసి మౌనికా రెడ్డి హల్‌చల్

అనుచరులతో కలిసి మౌనికా రెడ్డి హల్‌చల్

మధ్యాహ్నం సెయింట్ జోసఫ్ హైస్కూల్ పోలింగ్ బూత్‌కు నాగ మౌనిక వెళ్లారు. ఆమె అనుచరులతో కలిసి లోనికి వెళ్లారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. భూమా అనుచరులను పోలీసులు బయటకు పంపించారు.

మా నాయకులను బయటకు పంపిస్తారా?

మా నాయకులను బయటకు పంపిస్తారా?

తమ పార్టీ నాయకులను బయటకు పంపించడంపై భూమా నాగ మౌనిక మండిపడ్డారు. మా నాయకులనే బయటకు పంపిస్తారా అని పోలీసులను నిలదీశారు. మౌనిక పోలింగ్ బూత్‌లలోకి వెళ్లి ఏజెంట్లను ప్రభావితం చేస్తున్నారని ఇప్పటికే నైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.

శిల్పా మోహన్ రెడ్డి కూడా

శిల్పా మోహన్ రెడ్డి కూడా

నంద్యాల బస్టాండ్‌ దగ్గర బాలికల పాఠశాల పోలింగ్ బూత్‌లోకి తన అనుచరులతో వెళ్లేందుకు వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. అనుచరులను అనుమతించేది లేదని చెప్పారు. అభ్యర్థిని మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో ఆయన ఒక్కరే లోనికి వెళ్లారు.

భన్వర్ లాల్‌కు వైసిపి ఫిర్యాదు

భన్వర్ లాల్‌కు వైసిపి ఫిర్యాదు

కోడ్ ఉల్లంఘిస్తూ టిడిపి నేతలు నంద్యాలలోనే మకాం వేశారని వైసిపి నేతలు ఈసీ భన్వర్ లాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

జగన్‌పై రెండు రోజుల క్రితం నోటీసులు ఇస్తే..

జగన్‌పై రెండు రోజుల క్రితం నోటీసులు ఇస్తే..

సీఈసీ ఈ నెల 21న జగన్ విషయంలో నోటీసులు ఇస్తే ఓటర్లను ప్రభావితం చేసేలా పోలింగ్ రోజున ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. మౌనికా రెడ్డి పోలింగ్ బూత్‌లోకి వెళ్లారని, ఓటర్లను, పోలింగ్ బూత్ ఏజెంట్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టాలన్నారు.

English summary
Telugu Desam Party leader Bhuma Mounika Reddy on Wednesday create ruckus in Nandyal constituency. Voting today began across 255 polling stations in Nandyal Assembly constituency in Kurnool district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X