టాటా ఏస్ ఎక్కిన వోల్వో బస్సు.. ఏం జరిగిందో చూస్తే షాకే..?
చిత్తూరు : విశాఖపట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తోన్న వోల్వో బస్సు .. అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న వాహనంపైకి ఎక్కింది. అయితే బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అనుకునేసరికి .. తమ బస్సు టాటా ఏస్ ఎక్కడంతో వారంతా హహకారాలు చేశారు.
విశాఖపట్టణం నుంచి బెంగళూరుకు వోల్వో బస్సు వెళ్తుంది. అప్పటివరకు బాగానే వెళ్తున్న బస్సు రేణిగుంట ఆర్టీవో చెక్ పోస్టు వద్ద అదుపుతప్పింది. అతివేగ ప్రభావంతో .. పక్కనే నిలిచి ఉన్న టాటా ఏఎస్ వాహనంపై ఎక్కింది. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఒక్కసారికి భయాందోళనకు గురయ్యారు. కొందరికీ స్వల్ప గాయాలయ్యాయి. మరికొందరు షాక్నకు గురయ్యారు. అయితే వారంత గాయాలతో బయటపడటం .. తమకు మరో జన్మ వచ్చినట్టుందని పేర్కొన్నారు. తాము బతికి బట్టగలుగుతామని అనుకోలేదన్నారు.
అయితే ప్రమాదం జరిగే సమయంలో టాటా ఏఎస్ నిలిచి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ప్రాణ నష్టం జరిగి ఉండేది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణంపై విచారణ జరుపుతున్నారు. అతివేగం, బ్రేకులు ఫెయిలవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. తమ దర్యాప్తులో నిజ, నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసు అధికారులు చెప్తున్నారు.