వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు బీజేపీ ఎప్పుడో డోర్లు మూసేసింది .. ఆయనో అవకాశవాది : కన్నా ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలులో గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన చంద్రబాబు టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కేంద్ర ప్రభుత్వంతో వైరం పెట్టుకోవడం వల్ల మొన్నటి ఎన్నికల్లో తాము ఓడిపోయామని చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలకు సమాధానంగా కన్నా లక్ష్మీనారాయణ చంద్ర బాబు పెద్ద అవకాశవాది అని పేర్కొన్నారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరికీ తెలియదని అభిప్రాయపడ్డారు.

ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా అరెస్ట్ .. ఇది ప్రజాస్వామ్యమా .. జగన్ సర్కార్ పై కన్నా ఫైర్ ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా అరెస్ట్ .. ఇది ప్రజాస్వామ్యమా .. జగన్ సర్కార్ పై కన్నా ఫైర్

చంద్రబాబు తీరు అందితే జుట్టు అందక పోతే కాళ్ళు అన్న చందంగా ఉందని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.1999లో వాజపేయి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కాళ్లు, గడ్డాలు పట్టుకున్నారని, తద్వారా పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో బిజెపిని సమాధి చేశారని కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే, 2014లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని బిజెపిని ఏపీలో శాశ్వతంగా లేకుండా చేయాలని చూశారని ఆరోపించారు. ఏపీలో బీజేపీ బలపడకూడదన్న ప్రధాన లక్ష్యంతో చంద్రబాబు పని చేశారని ఆయన విమర్శించారు.

BJP has closed doors to chandrababu : kanna fire

మళ్లీ బీజేపీతో కలిసి పని చేయాలని చంద్రబాబు భావించినా,ప్రతిసారీ మోసపోవడానికి బిజెపి సిద్ధంగా లేదని కన్నా పేర్కొన్నారు.గత ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బిజెపి శాశ్వతంగా తలుపులు మూసేసింది అని అమిత్ షా పేర్కొన్నారని గుర్తు చేశారు. ఏపీలో ప్రస్తుతం బీజేపీ చిగురిస్తోందని, ఇలాంటి సమయంలో చంద్రబాబు కొత్త ఎత్తు వేశారని, మళ్లీ బీజేపీని ఎదగనీయకుండా చేయాలని చూస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.

ఇక వైసిపి ప్రభుత్వంపై సైతం ఆయన నిప్పులు చెరిగారు. సీఎం జగన్ పాలన లో ఏపీలో అరాచకం పెరిగిందన్నారు. ఇక ప్రస్తుతం వైసిపి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆశ తనకు లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా అభివృద్ధి, సంక్షేమం కలగా మిగిలిపోయే పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు.

English summary
Andhra Pradesh BJP President Kanna Laxmi Narayana said BJP is not ready to be get cheated once again by TDP. The senior BJP leader who has come to Kurnool to participate in the Gandhi Sankalpa Yatra has talked to a media channel alleging that he is an opportunistic politician and reminded BJP National President Amit Shah's comments in Narsapuram that BJP has closed the door to TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X