వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీకి సీన్ లేదు .. వైసీపీ, టీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయం మేమే అంటున్న బీజేపీ

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని గట్టిగా చెప్తున్నారు బీజేపీ నేత మురళీధర్ రావు . సీఎం చంద్రబాబుపై , అలాగే అధికార పార్టీ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు . చంద్రబాబు స్వయంకృత అపరాదాలే ఆయన ఓటమికి కారణం అయ్యాయని , ఏపీలో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనేది తామేనని, ఇక తెలంగాణాలోనూ ప్రత్యామ్నాయం మేమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు స్పష్టం చేశారు .

ఎమ్మెల్యే శ్రీదేవి దళిత మహిళ అంటూ కుల రాజకీయాలా ? కావాలనే వైసీపీ కులాల కార్చిచ్చు .. చంద్రబాబు ఫైర్ఎమ్మెల్యే శ్రీదేవి దళిత మహిళ అంటూ కుల రాజకీయాలా ? కావాలనే వైసీపీ కులాల కార్చిచ్చు .. చంద్రబాబు ఫైర్

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మురళీధర్ రావు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పాలనపై స్పందించారు. ఏపీలో టీడీపీకి భవిష్యత్ లేదని, చంద్రబాబు మంచి ఆర్గనైజర్ కానీ చంద్రబాబుని ప్రజలు నమ్మటం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేర్కొన్నారు . టీడీపీ పని అయిపోయిందని, లోకేష్‌పై పార్టీ నేతలు, కార్యకర్తలకే నమ్మకం లేదన్నారు. అందుకే నేతలందరూ వరుసగా పార్టీని వీడుతున్నారని చెప్పిన . ఇక చంద్రబాబు మంచి ఆర్గనైజరని కానీ ప్రజలు మాత్రం ఆయన్ను నమ్మడం లేదన్నారు.ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు మురళీధర్‌రావు. వైసీపీ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

BJP is the Alternative to the ruling parties in telugu states .. BJP leader Muralidhar rao

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమయ్యిందని విమర్శించారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. . ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎవరికీ అందుబాటులో లేకపోవడం ఆ పార్టీకి పెద్ద బలహీనతని, రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్‌ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని అభిప్రాయపడ్డారు మురళీధర్ రావు . కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదని , భవిష్య‌త్‌లో టీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణాలోనూ బీజేపీ అధికార పార్టీకి ప్రత్యామ్నాయం అన్నారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారన్నారు మురళీధర్ రావు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి తమ పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

English summary
BJP leader Muralidhar Rao says we are the alternative to the ruling party in AP. BJP national general secretary Muralidhar Rao has made it clear that ycp, and trs failed in administration so people will definitely accept BJP as alternative .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X