కేంద్రమంత్రి సాక్షిగా టీ బీజేపీ నేతల కునుకు! ఏబీఎన్ ప్రసారాలపై రాథోడ్
హైదరాబాద్: కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రెస్ మీట్లో తెలంగాణ బీజేపీ నేతలు కునుకు తీశారు. రాజ్యవర్ధన్ పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్ర రావు కునుకు తీస్తూ కనిపించారు.
ఏబీఎన్ ప్రసారాలపై కేంద్రమంత్రి
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. ప్రసారాల నిలిపివేత అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. మీడియా స్వేచ్ఛను హరిస్తే తాము ఊరుకోమని చెప్పారు.
మంత్రుల అక్రమాలపై చర్యలు తీసుకోవాలి: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి ఇసుక, ల్యాండ్, సారా మాఫియా నేతలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధినేత కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండలో తెరాస నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక శంకర్ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించారన్నారు.
మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆయన ఆరోపించారు. కాగా, నల్గొండ జిల్లాలో గురువారం నాడు బీజేపీ బంద్ కొనసాగుతోంది. అధికారులు వేధిస్తున్నారని ఓ యువకుడు బుధవారం కిషన్ రెడ్డి ఎదుటే ఆత్మహత్యకు యత్నించాడు. అధికారుల తీరును నిరసిస్తూ నల్గొండ పట్టణ బంద్కు బీజేపీ పిలుపునిచ్చింది.