విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజాగ్రహం తప్పదు, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలా?: చంద్రబాబుపై జీవీఎల్ నిప్పులు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

వైజాగ్-చెన్నై కారిడార్ ఖర్చులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని జీవీఎల్ విమర్శించారు.

బాబులా చేస్తే పిచ్చోడంటారు! 'నారాయణ' ఫీజు బాదుడుకు గంటా గ్రీన్ సిగ్నల్: జగన్బాబులా చేస్తే పిచ్చోడంటారు! 'నారాయణ' ఫీజు బాదుడుకు గంటా గ్రీన్ సిగ్నల్: జగన్

BJP MP GVL Narasimha Rao fires at Chandrababu

రాష్ట్రానికి కంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పడం దారుణమని అన్నారు. చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు.

దేశంలో ఏ పార్టీపై లేనంత ప్రజాగ్రహం టీడీపీపైనే ఉందని జీవీఎల్ చెప్పారు. ఈ విషయం ఇటీవల ఓ జాతీయ సర్వేలో వెల్లడైందని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని జీవీఎల్ నర్సింహారావు రావు జోస్యం చెప్పారు.

English summary
BJP MP GVL Narasimha Rao on Tuesday fired at Andhra Pradesh CM Chandrababu Naidu for lie statements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X