ప్రజాగ్రహం తప్పదు, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలా?: చంద్రబాబుపై జీవీఎల్ నిప్పులు
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
వైజాగ్-చెన్నై కారిడార్ ఖర్చులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని జీవీఎల్ విమర్శించారు.
బాబులా చేస్తే పిచ్చోడంటారు! 'నారాయణ' ఫీజు బాదుడుకు గంటా గ్రీన్ సిగ్నల్: జగన్
రాష్ట్రానికి కంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఎక్కువ నిధులు ఇచ్చామని చెప్పడం దారుణమని అన్నారు. చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు.
దేశంలో ఏ పార్టీపై లేనంత ప్రజాగ్రహం టీడీపీపైనే ఉందని జీవీఎల్ చెప్పారు. ఈ విషయం ఇటీవల ఓ జాతీయ సర్వేలో వెల్లడైందని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని జీవీఎల్ నర్సింహారావు రావు జోస్యం చెప్పారు.