బీజీపీ జాతీయ నేత పురంధరేశ్వరికి కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో చేరిక
ఏపీ బిజెపి మహిళా నేత, ఇటీవల జాతీయ ప్రధాన కార్యదర్శిగా బిజెపి జాతీయ కార్యవర్గంలో స్థానం దక్కించుకున్న నేత దగ్గుబాటి పురంధరేశ్వరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. దగ్గుబాటి పురంధరేశ్వరి అనారోగ్యంగా ఉండటంతో ఆమెకు కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. పురంధరేశ్వరికి కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పురంధరేశ్వరి చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది.
రాజధానిపై కేంద్రం పాత్ర పరిమితం .. బీజేపీ వైఖరి సుస్పష్టం : దగ్గుపాటి పురంధరేశ్వరి
ఇటీవల బీజేపీ అధిష్టానం ఆమెకు జాతీయ కార్యవర్గంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కించుకున్న ఆమెను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమయంలో ఆమెకు ఎవరి ద్వారా అయిన కరోనా సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆమెకు పదవి దక్కిన తర్వాత, పురంధరేశ్వరిని కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని కోరుతున్నారు.
Recommended Video
ఇక మరో పక్క భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో ఇండియా లో కొత్తగా 80,472 కరోనా కేసులు నమోదు కాగా ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 62 లక్షలు దాటింది. ఇందులో 9,40,441 కేసులు యాక్టివ్ కేసులు కాగా , 51,87,826 మంది కోలుకొని ఇప్పటికే డిశ్చార్జ్ అయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.