కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాణాసంచా కేంద్రంలో పేలుడు: నలుగురి మృతి, పలువురికి గాయాలు

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కొత్తపేట మండలం పలివెలలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి.

క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. కాగా, గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. దీపావళి పండుగ కోసం అనధికారికంగా పెద్ద ఎత్తున బాణాసంచా తయారు చేస్తున్నట్లు సమాచారం.

2014లో తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగి పది మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Blast in Fireworks center: Four dead

విషం తాగి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం

పశ్చిమగోదావరిలో జిల్లాల విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. నలుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.

కానిస్టేబుల్‌ చేతిలో ప్రమాదవశాత్తూ పేలిన తుపాకీ

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలింది. కానిస్టేబుల్‌ చేతిలో ఉన్న ప్రమాదవశాత్తూ తుపాకీ పేలిందని, ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.

English summary
Four died in Fireworks center blast incident, in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X