ఆమదాలవలసలో నీలిచిత్రాల కలకలం: స్థానికులతోనే చిత్రీకరణ!
శ్రీకాకుళం: జిల్లాలోని ఆమదాలవలస, పరిసర ప్రాంతాల్లో నీలి చిత్రాల చిత్రీకరణ కలకలం సృష్టిస్తోంది. గత మూడు రోజులుగా ఈ నీలి చిత్రాల చిత్రీకరణ విషయం ఇప్పుడు ఆ ప్రాంతంలో హాట్ టాపిక్గా మారింది. ఏ నోట విన్నా అదే మాటపై చర్చ సాగుతోంది.
కాగా, ఆమదాలవలస పట్టణానికి చెందిన కొంతమంది యువకులు ప్రత్యక్షంగా ఈ అశ్లీల చిత్రాలు చిత్రీకరించి విడుదల చేశారని సమాచారం. ఈ నీలి చిత్రాల్లో ఉన్న వ్యక్తులు పట్టణ ప్రజలకు పరిచయస్తులని, అందరికీ తెలిసిన వారని కూడా ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఈ చిత్రాల్లో పట్టణానికి చెందిన యువకులు, మహిళలు ఉన్నట్టు సమాచారం.
ఇది ఇలా ఉండగా, వీరు తీసిన ఈ నీలి చిత్రాలు చాలామంది యువకుల సెల్ఫోన్లలో హల్చల్ చేస్తున్నట్లు తెలిసింది. కాగా, ఈ విషయంపై పోలీసులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.
కాగా, ఆమదాలవలసలో నీలిచిత్రాలు చిత్రీకరణ అంశంపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ నవీన్కుమార్ చెప్పారు. అయితే ఈ విషయంపై పట్టణంలో ప్రజలు చర్చించుకుంటున్నట్లు తెలిసిందని తెలిపారు. అయితే, ఈ విషయంపై దృష్టి సారించి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.