వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అఖిల రాజీనామా చేయాల్సిందే, ఆ బోట్లన్ని దేవినేని, ప్రత్తిపాటిల బినామీలవే'

సంఘటనకు బాధ్యత వహిస్తూ టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: కృష్ణా నదిలో ప్రమాదానికి గురైన బోటు మంత్రులు, అధికారుల అండదండలతోనే నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రుల బినామీలే ఆ బోట్లను నడిపిస్తున్నారని సీపీఐ నేత దోనేపూడి శంకర్ ఆరోపించారు.

కృష్ణా నదిలో నడుస్తున్న అక్రమ బోట్లన్నీమంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు బినామీలవేనని ఆయన ఆరోపించారు. బోటు ప్రమాదం నేపథ్యంలో విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన నిర్వహించారు.

boats in krishna river are benami properties of ap ministers

ప్రైవేటు బోట్లు అన్నింటినీ రద్దు చేయాలని ఈ సందర్భంగా దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు అధికార యంత్రాంగం నుంచి ఎటువంటి తప్పు జరగలేదని అఖిలప్రియ చెబుతోన్న సంగతి తెలిసిందే.

English summary
CPI Leader Donepudi Shankar alleged boats in krishna river are benami properties of AP Ministers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X