చెప్పులు, గుడ్లే, మహిళ గానీ మహిళ..: రోజాపై బోడె ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై తెలుగుదేశం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్లో తన పేరుందంటూ రోజా ఆరోపణలు చేయడంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రోజాను పరుష పదజాలంతో దూషించారు. అంతేగాక, తమ నియోజకవర్గంకు వస్తే రోజాపై చెప్పులు, గుడ్లు పడతాయని బోడే ప్రసాద్ హెచ్చరించారు. రోజా ఓ మహిళ గానీ మహిళ అని.. ఆమె తనపై ఈ విధంగా మాట్లతాడటం సిగ్గుచేటని అన్నారు. తనపై ఆరోపణలు చేస్తుండటంతో మూడేళ్లుగా కడుపు రగిలిపోతోందని, అందుకే ఈ రోజు ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చెప్పారు.
రోజా విమర్శలు ఇలా..
కృష్ణాజిల్లాలోని కంకిపాడు పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం వైసిపి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. కాల్మనీ, సెక్స్ రాకెట్, ఇసుక మాఫియా వంటి స్కాంలో.. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాత్ర ఉందని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. అంతేగాక, కృష్ణాజిల్లా అల్లుడైన సిఎం చంద్రబాబు కృష్ణానదిని, జిల్లా ప్రజలను నిలువునా దోచుకుంటున్నారన్నారు. లోకేష్ వార్డు మెంబర్గా కూడా గెలవలేడని ఎద్దేవా చేశారు.